Dubai: షార్జా అగ్నిప్రమాదంలో రెహమాన్ దగ్గర పని చేసిన సౌండ్ ఇంజనీర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత గురువారం రాత్రి యూఏఈ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో షార్జా అల్ నహ్దా రెసిడెన్షియల్ టవర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఐదుగురు మృతిచెందగా.. ఇందులో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఇటీవలే వివాహమైన ముంబైకి చెందిన నవ వధువు ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ దగ్గర సౌండ్ ఇంజనీర్గా పని చేసిన మైఖేల్ సత్యదాస్ కూడా ప్రాణాలు వదిలాడు. ఈ మేరకు సత్యదాస్ సోదరుడు సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని తెలియజేశాడు.

Also Read
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
గత గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దాలో 750 అపార్ట్మెంట్లతో కూడిన 39 అంతస్తుల టవర్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ముంబైకి చెందిన నవ వధువు మృతి చెందడం.. ఆమె భర్త ప్రాణాలతో కొట్టిమిట్టాడడం హృదయాలను కలిచివేసే సంఘటన. ఇక మైఖేల్ సత్యదాస్ అయితే.. సంగీత దర్శకుడు రెహమాన్తో పాటు అనేక మంది కళాకారుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
తన సోదరుడు మైఖేల్ సత్యదాస్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం.. దీన్ని జీర్ణించుకోలేని విషయమని మైఖేల్ సత్యదాస్ సోదరుడు ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో దుఖంతో ఉన్నామని.. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. మైఖేల్ ఎప్పుడూ మా జ్ఞాపకాల్లో ఉంటాడని ఎక్స్లో ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ వ్రాసుకొచ్చాడు. మైఖేల్ సత్యదాస్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో డీహెచ్బీ లైవ్లో ఉద్యోగిగా ఉన్నాడు. 2022లో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మైఖేల్ కుటుంబ సభ్యుడయ్యాడని DXB లైవ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Dhanush Divorce: అభిమానుల ఆశలన్నీ వమ్ము.. సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్
ముంబైకి చెందిన మహిళ(29)కు ఫిబ్రవరిలోనే వివాహం అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. ఇక ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ మేరకు మృతురాలి స్నేహితుడు సోషల్ మీడియాలో తెలియజేశాడు. అలాగే భారత కాన్సులేట్ జనరల్ కూడా వారి మరణాలను ధృవీకరించింది. పలువురు గాయపడినట్లుగా కూడా పేర్కొంది. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ‘వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు..’ డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ శర్మ స్పీచ్..!
తాజావార్తలు
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?