Ganja : ఈజీ మనీ ముసుగులో గంజాయి అమ్ముతు పట్టుబడిన ఇద్దరు నిందితులు
- రూ. 25 వేల విలువైన గంజాయి స్వాధీనం
- రూ.20 లక్షల విలువైన వాహనాలు సీజ్
- ఈజీ మనీ ముసుగులో గంజాయి సరఫరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుకుంది ఇంజనీరింగ్. చేస్తున్న వృత్తి మోడల్ ఫోటోగ్రఫీ. తిరిగేది ఖరీదైన కార్లు, బైకుల్లో, వాడుతున్న సెల్ ఫోన్లు చూస్తే రూ. లక్షల ఐ ఫోన్లు . ఖరీదైన అద్దె నివాసముంటు, సమాజంలో బడా బాబుల్లా వ్యహారం. కాని మూడోకంటికి తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులకు పట్టుబ డి ఉన్న పరువు కాస్తా.. బజార్లో పడేసి.. కటకటాల పాలైన యువకుల చీకటి బాగోతం. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లి వసంతనగర్ హౌజ్ నెంబ రు 741, రోడ్ నెంబ రు 21లో ఖరీదైన అద్దె భవనంలో ఇద్దరు ఇంజనీరింగ్ యువకులు గంజాయి అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్ టి ఎఫ్ సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతితోపాటు సిబ్బంది కలిసి ఇంట్లో సోదాలు నిర్వహించారు.
Hyderabad: మియాపూర్లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
ఖరీదైన అద్దె భవనంలో ఖమ్మంకు చెందిన బేగం నిలేష్ కుమార్, వరంగల్ డొర్నకల్కు చెందిన సిరాజుల్లా నివాసముంటున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించినపుడు 1.185 కిలోల గంజాయి లభించింది. ఇద్దరు నిందితులను విచారించగా గత కొంత కాలంగా ఇన్స్ట్రా గ్రామ్లో కాకినాడ నుంచి గంజాయిని తెప్పిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారని వెల్లడించారని సిఐ తెలిపారు. గంజాయిని కారులోను, బైకులోను తీసుకవచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. వీరివద్ద నుంచి రూ. 15 లక్షల కారు, రూ. మూడు లక్షల విలువ చేసే బైక్, రూ. 3 లక్షల విలువ మూడు ఐ ఫో న్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.25 వేలు. పట్టుబడిన వాహనాల ఖరీదు మాత్రం రూపాయలు 20 లక్షల పైనే ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు ఖమ్మంలోని ఇంజనీరింగ్ సమయములో స్నేహితులు. స్నేహితులుగా హైదారాబాద్ వచ్చి నివాసముంటున్నారు. నిలేష్ కుమార్ మోడల్ ఫోటోగ్రఫీ చేస్తు మరో పక్క గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబ డ్డారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. గంజాయిని పట్టుకున్న టీమ్లో కానిస్టేబుళ్లు రాజేష్, వికాష్, జయచంద్ర, కాశీలు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్ను అడిషనల్ ఎస్పీ భాస్కర్ అభినందించారు.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం