Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- నాలుగు రోజుల్లో పాక్ భద్రతా బలగాలకు భారీ నష్టం
- BLA, TTP సమన్వయ దాడుల్లో 42 మంది మృతి
- అసీం మునీర్పై పాకిస్థాన్లోనే తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది. అది ఏదో రోజు కాటేస్తుంది. సరిగా ఇలాంటి పరిస్థితే పాకిస్తాన్కు దాపురించింది. ఇన్నాళ్లు ఏ ఉగ్రవాదంతో భారత్ను అస్థిరపరచాలని చూసిందో, ఇప్పుడు అదే ఉగ్రవాదానికి బలవుతోంది. దాయాది దేశంలో వరస దాడుల్లో నాలుగు రోజుల్లోనే 42 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షన్ అసిమ్ మునీర్ దారుణంగా విఫలమయ్యాడని సొంత దేశంలోనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పనిచేయడానికి పాక్ ఆర్మీ వణికిపోతోంది.
జూలై 6 నుంచి 9 వరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA), తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) సంయుక్తంగా దాడులు చేశాయి. బలూచిస్తాన్లోని జియారత్ జిల్లాలోని మంగీ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని కాపాడుతున్న పోలీస్ అవుట్ పోస్ట్పై జరిగిన దాడిలో 27 మంది పోలీసులు, 11 మంది సైనికులు, నలుగురు పౌరులు మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈ దాడి తర్వాత 18 మంది పోలీసుల్ని టీటీపీ అపహరించింది. అనంతరం వీరిని హత్య చేసినట్లు వెల్లడివంచింది. ఇటీవల కాలంలో పాక్లో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఇదే టైమ్లో లస్బేలా జిల్లాలోని బేలా విండర్ ప్రాంతంలోని సైనిక కాన్వాయ్పై బీఎల్ఏ దాడి చేసింది. ఇందులో 11 మంది సైనికులు మరణించారు. బీఎల్ఏ 17 మందిని చంపినట్లు పేర్కొంటోంది.
Also Read
- Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
- Iran Oman Strait of Hormuz Deal: హార్ముజ్ జలసంధి మాదే.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. ట్రంప్ హెచ్చరికలకు స్ట్రాంగ్ కౌంటర్
- Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
- US: వర్జీనియా వర్శిటీలో కాల్పులు.. పలువురికి గాయాలు
ఇదిలా ఉంటే, ఈ వరస దాడులపై పాక్ మాజీ ఎంపీ బుష్రా గోహర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంతటి వైఫల్యాలకు ఎవరైనా రాజీనామా చేశారా? అని ఆమె ప్రశ్నించారు. పష్తూన్ ఖ్వా మిల్లీ అవామీ పార్టీ అధ్యక్షుడు మహ్మూద్ ఖాన్ అచక్జాయ్ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరును ప్రశ్నించారు. పాక్ విశ్లేషకుడు హుస్సేన్ నదీమ్ అసిం మునీర్ నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘హార్డ్ స్టేట్గా చెప్పుకునే దేశం ఇప్పుడు ఫెయిల్డ్ స్టేట్లా కనిపిస్తోంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
-
Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
-
Snake bite: కానిస్టేబుల్ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
-
Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?