Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
- నాలుగు రోజుల్లో పాక్ భద్రతా బలగాలకు భారీ నష్టం
- BLA, TTP సమన్వయ దాడుల్లో 42 మంది మృతి
- అసీం మునీర్పై పాకిస్థాన్లోనే తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది. అది ఏదో రోజు కాటేస్తుంది. సరిగా ఇలాంటి పరిస్థితే పాకిస్తాన్కు దాపురించింది. ఇన్నాళ్లు ఏ ఉగ్రవాదంతో భారత్ను అస్థిరపరచాలని చూసిందో, ఇప్పుడు అదే ఉగ్రవాదానికి బలవుతోంది. దాయాది దేశంలో వరస దాడుల్లో నాలుగు రోజుల్లోనే 42 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షన్ అసిమ్ మునీర్ దారుణంగా విఫలమయ్యాడని సొంత దేశంలోనే విమర్శలు వస్తున్నాయి. నిజానికి బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పనిచేయడానికి పాక్ ఆర్మీ వణికిపోతోంది.
జూలై 6 నుంచి 9 వరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA), తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) సంయుక్తంగా దాడులు చేశాయి. బలూచిస్తాన్లోని జియారత్ జిల్లాలోని మంగీ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని కాపాడుతున్న పోలీస్ అవుట్ పోస్ట్పై జరిగిన దాడిలో 27 మంది పోలీసులు, 11 మంది సైనికులు, నలుగురు పౌరులు మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈ దాడి తర్వాత 18 మంది పోలీసుల్ని టీటీపీ అపహరించింది. అనంతరం వీరిని హత్య చేసినట్లు వెల్లడివంచింది. ఇటీవల కాలంలో పాక్లో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది. ఇదే టైమ్లో లస్బేలా జిల్లాలోని బేలా విండర్ ప్రాంతంలోని సైనిక కాన్వాయ్పై బీఎల్ఏ దాడి చేసింది. ఇందులో 11 మంది సైనికులు మరణించారు. బీఎల్ఏ 17 మందిని చంపినట్లు పేర్కొంటోంది.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
ఇదిలా ఉంటే, ఈ వరస దాడులపై పాక్ మాజీ ఎంపీ బుష్రా గోహర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇంతటి వైఫల్యాలకు ఎవరైనా రాజీనామా చేశారా? అని ఆమె ప్రశ్నించారు. పష్తూన్ ఖ్వా మిల్లీ అవామీ పార్టీ అధ్యక్షుడు మహ్మూద్ ఖాన్ అచక్జాయ్ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరును ప్రశ్నించారు. పాక్ విశ్లేషకుడు హుస్సేన్ నదీమ్ అసిం మునీర్ నాయకత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘హార్డ్ స్టేట్గా చెప్పుకునే దేశం ఇప్పుడు ఫెయిల్డ్ స్టేట్లా కనిపిస్తోంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?