Tummala Nageswara Rao : రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి తుమ్మల సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఈ రోజు రైతుబంధు నిధుల విడుదల పై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా అధికారులు ఇప్పటి వరకు 40% శాతం మంది రైతులకు రైతుబంధు అందిందని అనగా 27 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలలోకి రైతుబంధు జమ చేయడం జరిగిందని తెలిపారు. వరి, ఇతర యాసంగి పంటల నాట్లు, సాగు ముమ్మరంగా రాష్ట్రావ్యాప్తంగా జరుగుతునందున త్వరతిగతిన రైతుబంధు సొమ్ము జమ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశించారు.
Also Read
రోజు వారిగా నిధులు విడుదల జరిగేలా చూడాలని, వచ్చే సోమవారం నుండి అధిక సంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయం నూతన ప్రభుత్వం యొక్క అత్యున్నత ప్రాధాన్యత అని, గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతు బంధును రైతులకు సకాలంలో అందచేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలు రైతుబంధు డబ్బుల విడుదల పై ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!