Tummala Nageswara Rao : బీజేపీ – బీఆర్ఎస్ పార్టీల్లో కుర్చీల కొట్లాట జరుగుతుంది
- మీ కుర్చీల కోట్లలో మమ్ములను ఎందుకు లాగుతారు
- బీజేపీలో ఈటల అయినా ఇంకెవ్వరినైనా అధ్యక్షునిగా పెట్టుకోండి నాకెందుకు
- నన్ను విమర్శ చేస్తే పడను
- నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతా..!
- మంత్రి తుమ్మల మీడియాతో చిట్ చాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కుర్చీల కొట్లాట జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. మీ కుర్చీల కోట్లలో మమ్ములను ఎందుకు లాగుతారన్నారు. బీజేపీలో ఈటలను అయినా ఇంకెవ్వరినైనా అధ్యక్షునిగా పెట్టుకోండి నాకెందుకని, నన్ను విమర్శ చేస్తే పడను.. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతా అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో నేను ఉన్నాను… మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు అనేది నాకు తెలుసు అని, మూసీ ప్రక్షాళన చేయడానికి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ పెట్టారు కదా? మూసీ ప్రక్షాళన చెయ్యకుండా…మూసి అభివృద్ధి ఎలా చేస్తా అనుకున్నారు? కూల్చి ఉంటే ఒకలా? కుర్చీ పోతే మరోలా మాటలు మారవద్దని ఆయన అన్నారు. మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ఇంకా DPR నేను చూడలేదని, దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం షాపులు మూత.. 10 రోజులు పస్తులేనా..?
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
అంతేకాకుండా.. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్ష నేతలు సహకరించకపోగా.. విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 42 లక్షల మందికి రుణమాఫీ చేశామని ఎప్పుడూ చెప్పలేదని, గత ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టినవి లెక్కలోకి తీసుకోవాలని సీఎం చెప్పారన్నారు. పంటరుణాలు తీసుకున్న 42లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ఇచ్చారని, వారికి 31వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. రుణమాఫీ కాని వారి వివరాలు పంపాలని అడుగుతున్నామని, ఒకే నెలలో 22లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేశామని ఆయన వెల్లడించారు. రూ.2లక్షలకు పైగా రుణం ఉన్న వారికి రూ.2లక్షలు వేస్తామని చెప్పామని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నారన్నారు. రైతుల పట్ల ఆయా పార్టీల నేతలకు ఉన్న అక్కసు అర్థమవుతోందన్నారు. పదేళ్లు పాలించిన పార్టీ నేతలు కూడా రుణమాఫీని విమర్శిస్తున్నారు అని తుమ్మల మండిపడ్డారు.
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!