Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం షాపులు మూత.. 10 రోజులు పస్తులేనా..?
- మందుబాబులకు బ్యాడ్న్యూస్..
- రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు మూత..
- నిన్నటితో వైన్ షాపుల్లో ముగిసిన కాంట్రాక్టు ఉద్యోగుల కాల పరిమితి..
- మరో 10 రోజులు వైన్ షాపులు తెరవాలని కోరిన ప్రభుత్వం..
- ఇవాళ నుంచే విధుల్లోకి రాని సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యంషాపులు మూతపడ్డాయి.. నిన్నటితో వైన్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తి అయ్యింది.. అయితే, మరో 10 రోజులు వైన్ షాపులు తెరవాలని కోరింది ఏపీ ప్రభుత్వం.. కానీ, పది రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని, ప్రైవేట్ వైన్ షాప్స్ వస్తాయి కాబట్టి.. ఇవాళ నుంచి విధుల్లోకి రాలేదు సిబ్బంది.. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు మద్యం షాపులు తెరుచుకోలేదు.. రాష్ట్ర వ్యాప్తంగా 3,240 వైన్ షాపులు మూతబడ్డాయి.. దీంతో.. వైన్ షాపులు తెరుచుకోకపోవడంతో.. మద్యం కావాలంటే మందు బాబులు బార్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.. సాధారణంగా.. వైన్ షాపులు.. బార్లలో మద్యం ధరల్లో తేడా ఉండడంతో.. ఇప్పుడు మద్యం మరింత ప్రియం అయినట్టు అయ్యింది.. కాగా, ఈ నెల 12న కొత్త మద్యం పాలసీ ప్రకారం కొత్త మద్యం షాపులు ఓపెన్ కానున్న విషయం విదితమే..
Read Also: Komatireddy Venkat Reddy: మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తాం..
Also Read
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ఇక, ఏపీ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.. ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి.. ఈ నెల 12వ తేదీ నుండి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి.. కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ కావడంతో.. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. 11న 3,396 షాపులకు లాటరీ తీస్తారు.. దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలుగా నిర్ణయించింది ఎక్సైజ్ శాఖ.. లైసెన్స్ ఫీజులు 50 నుంచి 85 లక్షలు.. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.. అందుకు అనుగుణంగా మంగళవారం ఉదయం జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు షాపులను నోటిఫై చేస్తూ గెజిట్లు జారీ చేశారు.. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధానాల్లోనూ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది ఏపీ ఎక్సైజ్ శాఖ..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!