TTD EO Syamalarao: టీటీడీలో లోపాలు గుర్తించాం.. సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం..
- టీటీడీలో లోపాలను గుర్తించాం.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం..
- వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు..
- క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత చాలా లోపాలను గుర్తించామన్న టీటీడీ ఈవో శ్వామలరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD EO Syamalarao: టీటీడీలో లోపాలను గుర్తించాం.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమలలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. టీటీడీ ఈవోగా భాధ్యతలు స్వీకరించే సమయంలో వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. స్వామివారికి సమర్పించే అన్నప్రసాదాలు మొదలుకోని, లడ్డూ ప్రసాదం, భక్తులకు అందించే అన్నప్రసాదాలు నాణ్యత పెంచాలని.. ఆన్ లైన్ లో జారీ చేసే దర్శన టికెట్ల జారిలో లోపాలను గుర్తించి సరిదిద్దాలని చెప్పారు.. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత చాలా లోపాలను గుర్తించామని తెలిపారు శ్వామలరావు.
Read Also: Prank Video: ఓరి మీ దుంపలు తెగ.. నవ్వించి చంపేస్తారా ఏంటి..?
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
సర్వదర్శనం భక్తులకు క్యూ లైనులో అన్నప్రసాద వితరణ సరైన రీతిలో జరగడం లేదన్నారు శ్వామలరావు.. క్యూ లైనులో వేచి వున్న చంటిబిడ్డలకు పాలు అందించడం లేదు.. క్యూ లైనులో వేచివున్న భక్తులకు కనీస సమాచారం అందించే వ్యవస్థ కూడా లేనట్టు ఫిర్యాదులు అందాయి.. క్యూ లైన్లో నూతనంగా మూడు అన్నప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.. వారంతం రద్దీ సమయంలో భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణకు ఎస్వీబీసీ సీఈవోకి భాధ్యతలు అప్పగించాం.. అన్నప్రసాద కాంప్లెక్స్లోని నిత్యం 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.. భక్తులకు సేవలందించడానికి ఉద్యోగుల కొరత ఉంది.. కావాల్సినవారి కంటే మూడోవంతు మాత్రమే అందుబాటులో ఉన్నారని తెలిపారు.
Read Also: Pakistani Terrorists: పాక్ ఉగ్రవాదులను వేటాడేందుకు 500 కమాండోలు..
ఇక, అన్నప్రసాదంలో నాణ్యత పెంపునకు సంబంధించి ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలను తీసుకోని మార్పులు తీసుకువస్తాం అన్నారు శ్యామలరావు.. లడ్డూ నాణ్యత పెంచడానికి నాణ్యమైన నెయ్యి సేకరణపై దృష్టి పెట్టామన్న ఆయన.. ముడిసరుకులు నాణ్యత పరిశీలనకు ఫుడ్ సేప్టి అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తూన్నం అన్నారు. ప్రైవేట్ హోటల్స్ ని బ్రాండింగ్ వున్న సంస్థలకు కేటాయించాలని నిర్ణయించాం.. టీటీడీకి ఆదాయం రావడంతో పాటు భక్తులకు నాణ్యమైన ఆహారం ఆందించేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. సర్వదర్శనం భక్తులకు వారానికి 1.65 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. టీటీడీ ఐటీ వ్యవస్థలో అనేక లోపాలు వున్నాయి.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తూన్నాం అన్నారు. కొంత మంది భక్తులు ఒకే ఐడీతో ,ఒకే మొబైల్ నంబర్ తో వందల సార్లు టికెట్లు పొందినట్లు గుర్తించాం.. త్వరలో ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్ కి ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. దళారులపై నమోదవుతున్న కేసులు పట్ల పోలిసులు సరిగ్గా స్పందించడం లేదని గుర్తించామనంటూ వ్యాఖ్యానించారు టీటీడీ ఈవో శ్యామలరావు.
తాజావార్తలు
-
Jantar Mantar Protest: జంతర్మంతర్లో విద్యార్థుల ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు.. షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ హాజరు
-
Vande Mataram Bill 2026: ‘వందేమాతరం’పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
-
NBK 111 : బాలయ్య మాస్ ర్యాంపేజ్.. ఫ్యాన్సీ రేటుకి NBK 111 ఓటీటీ డీల్ క్లోజ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్