ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్ర రాజ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం వైట్హౌస్లో 3 గంటల పాటు ట్రంప్-నెతన్యాహు రహస్యంగా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇక ఇద్దరి సమావేశం తర్వాత ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్తో చర్చలు జరుగుతున్నాయని.. దౌత్యం అనిశ్చితంగానే ఉందని తెలిపారు. చర్చలు విఫలమైతే సమన్వయం కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్తో నిరంతర చర్చలకు ఒత్తిడి తెచ్చానని.. ఇప్పటికీ చర్చలకు డోర్లు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తానికి వార్నింగ్ల దగ్గర నుంచి చర్చలకు ట్రంప్ తెరలేపారు.
డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 వేల మంది చనిపోయారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగి.. నిరసనకారులను చంపితే సైనిక చర్యకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రానికి వచ్చి మోహరించింది. తక్షణమే అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్పై ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేశారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్-నెతన్యాహు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలా ఉంటే అమెరికా నేతృత్వంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ పీస్లో ఇజ్రాయెల్ చేరింది. చాలా రోజుల తర్జన భర్జన తర్వాత నెతన్యాహు సంతకం చేశారు. ఈ ఫోరమ్లో పాశ్చాత్య భాగస్వాములతో పాటు టర్కీ, ఖతార్ కూడా ఉన్నాయి. గతంలో గాజాలో వారి పాత్రపై ఇజ్రాయెల్ విమర్శలు చేసింది. మొత్తానికి శాంతి మండలిలో ఇజ్రాయెల్ చేరింది.
