A strange Rules: ఆ ట్రైనింగ్ స్కూల్లో వింత రూల్.. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురాతన కాలంలో విధించే పన్నులు, జరిమానాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. స్కూలుకి వెళ్లే పిల్లలు బొట్టు పెట్టుకోవడం, చేతికి కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం మామూలే. కానీ ఏపీలోని ఒక ట్రైనింగ్ సెంటర్ లో ఇలాంటివి పాటిస్తే తాట తీస్తారు. జరిమానాలు విధిస్తారు. ఆ ట్రైనింగ్ స్కూల్ ఎక్కుడుందా అడుగుతున్నారా… అక్కడికే వస్తున్నాం. బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే జరిమానాలు విధించే ట్రైనింగ్ సెంటర్ కర్నూలు డీఎంహెచ్ వో ప్రాంగణంలో ఉంది. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులను ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
కర్నూలు డీఎంహెచ్వో కార్యాలయ ఆవరణలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఉంది. అందులో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్గా శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం కూడా ఉంది. ఈ కోర్సుకు ప్రిన్సిపల్, వార్డెన్గా విజయ సుశీల వ్యవహరిస్తున్నారు. ఆమె నిత్యం వేధిస్తుండటం… బొట్టు, గోరింటాకు పెట్టుకున్నా జరిమానా వేస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్గా శిక్షణ కోసం వస్తే వార్డెన్ తన వ్యక్తిగత సేవలన్నీ చేయించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
వేధింపులు ఎక్కువ కావడంతో రెండురోజుల క్రితం ఇద్దరు యువతులు ఫ్యాన్కు ఉరేసుకునేందుకు యత్నించారు. బాధితులు తమ సమస్యను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మీనర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజయ సుశీలను పిలిపించి వసతి గృహంలో ఉండకూడదని.. ఇల్లు చూసుకోవాలని చెప్పారు. తనపై ఫిర్యాదు చేయడంతో విజయ సుశీల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినులవద్ద గతంలో తీసుకున్న లేఖలను బూచిగా చూపి తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించారు.
దీంతో గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరిలో ఓ యువతి మంగళవారం మళ్లీ సూసైడ్ కి ప్రయత్నించడం కలకలం రేపింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అధికారులు సెలవులిచ్చి విద్యార్థినులందరినీ ఇంటికి పంపేశారు. తమను వేధించిన వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్గా శిక్షణ తీసుకుంటున్న యువతులు కోరుతున్నారు. ఈరోజుల్లో ఇలాంటి రూల్స్, జరిమానాలు ఏంటని సభ్యసమాజం నివ్వెరపోతోంది.
Read Also: Live Incident: ఎన్ని బాధలున్నాయ్ కొడుకా.. ఇలా కావాలనే రైలుకింద పడ్డావు
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!