BC Declaration: బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ డిక్లరేషన్ పై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ వేసింది. బీసీ డిక్లరేషన్ పై పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే నేడు ( బుధవారం ) పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో ఆరుగురిని కో చైర్మెన్లుగా ఎంపిక చేసింది. ఈ కమిటీకి మరో 9 మంది అడ్వైజరీలను కూడా నియమించింది.
Read Also: Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
ఇప్పటికే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్లను ప్రకటించింది. ఈ నెల 29న మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.. కానీ కొన్ని కారణాలతో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటనను వాయిదా వేసింది. ప్రకటించాల్సిన మిగిలిన డిక్లరేషన్లపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇదిలా ఉంటే మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలు, బీసీలకు సీట్ల కేటాయింపు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: అదిరా పవన్ రేంజ్.. పాకిస్థాన్ లో కూడా ‘బ్రో’ దే రచ్చ
బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు పలు సూచనలు చేశారు. కృష్ణయ్య చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పొన్నాల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఈ మేరకు అభ్యర్థులను కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ప్రకటించలని చూస్తుంది. ఈ మేరకు నిన్ననే( మంగళవారం ) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ లో అభ్యర్థుల తొలి జాబితాను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది.
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!