BC Declaration: బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా పొన్నం ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ డిక్లరేషన్ పై పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ వేసింది. బీసీ డిక్లరేషన్ పై పొందుపర్చాల్సిన అంశాలపై ఈ కమిటీ చూసుకుంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే నేడు ( బుధవారం ) పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో ఆరుగురిని కో చైర్మెన్లుగా ఎంపిక చేసింది. ఈ కమిటీకి మరో 9 మంది అడ్వైజరీలను కూడా నియమించింది.
Read Also: Pew Research Survey: 80 శాతం ప్రధాని మోడీకి సానుకూలం.. ప్యూ సర్వేలో కీలక విషయాలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఇప్పటికే కాంగ్రెస్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, దళిత డిక్లరేషన్లను ప్రకటించింది. ఈ నెల 29న మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.. కానీ కొన్ని కారణాలతో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటనను వాయిదా వేసింది. ప్రకటించాల్సిన మిగిలిన డిక్లరేషన్లపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇదిలా ఉంటే మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో బీసీ సంక్షేమ సంఘం నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలు, బీసీలకు సీట్ల కేటాయింపు లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున సీట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: అదిరా పవన్ రేంజ్.. పాకిస్థాన్ లో కూడా ‘బ్రో’ దే రచ్చ
బీసీ డిక్లరేషన్ లో పొందుపర్చాల్సిన అంశాలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు పలు సూచనలు చేశారు. కృష్ణయ్య చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పొన్నాల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఈ మేరకు అభ్యర్థులను కూడా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే ప్రకటించలని చూస్తుంది. ఈ మేరకు నిన్ననే( మంగళవారం ) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్ లో అభ్యర్థుల తొలి జాబితాను షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కానుంది.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!