Darshan: యాక్టర్ దర్శన్కి కోర్టులో చుక్కెదురు.. అందుకు నో చెప్పిన కోర్టు..
- దర్శన్ కేసులో కీలక పరిణామం..
- ఇంటి భోజనానికి నో చెప్పిన కోర్టు..
- హత్యా నిందితుడికి ఈ సౌకర్యాలు ఇవ్వలేమని వ్యాఖ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan: కర్ణాటకలో పాటు యావత్ దేశాన్ని షాక్కి గురిచేసింది రేణుకా స్వామి హత్య కేసు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న దర్శన్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ కేసులో అతని లివింగ్ పార్ట్నర్ పవిత్ర గౌడలతో పాటు నిందితులంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనకు ఇంటి భోజనం కావాలని పిటిషన్ దాఖలు చేసిన దర్శన్కి కోర్టులో చుక్కెదురైంది. అతని పిటిషన్ని బెంగళూర్ కోర్టు గురువారం తిరస్కరించింది. తనకు దుస్తులు, పరుపు, పుస్తకాలను అనుమతించాలని ఆయన పిటిషన్లో కోరారు. దీనికి సంబంధించి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలని ఈ నెల ప్రారంభంలో కర్ణాటక హైకోర్టు దర్శన్ని ఆదేశించింది.
Read Also: Maldives – India: మాల్దీవులకు భారత్ భారీ షాక్.. దురహంకారానికి కళ్లే
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
జైలులో ఆహారం జీర్ణించుకోలేకపోతున్నానని, బరువు కూడా తగ్గానని దర్శన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. డయేరియాతో బాధపడుతున్నానని, జైలు అధికారులు ఫుడ్ పాయిజనింగ్ కేసుగా నిర్ధారించారని అందులో ప్రస్తావించారు. దర్శన్ పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు, జైలు నిబంధనలను ఉటంకిస్తూ, నటుడు కోరిన సౌకర్యాలను హత్యా నిందితుడికి ఇవ్వలేమని పేర్కొంది.
దర్శన్ అభిమాని అయిన చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి(33), దర్శన్ సన్నిహితురాలైన పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడనే కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. జూన్ 09న బెంగళూర్కి స్వామిని రప్పించి దర్శన్, అతని సహాయకులు దాడికి తెగబడ్డారు. దెబ్బలకు తట్టుకోలేక అతను మరణించాడు. పోస్టుమార్టం నివేదికలో అతడిని కరెంట్ షాక్కి గురిచేయడంతో పాటు రక్తస్రావం కావడంతో మరణించనట్లు తెలిపింది. ఈ కేసులో నెంబర్ 1 నిందితురాలిగా పవిత్ర గౌడ ఉంది. ఆమె నిందితులను ప్రేరేపించి వారిని హత్య కేసులో పాల్గొనేలా చేసిందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!