Tomato Price: రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. ఇప్పుడు కేజీ 120 కాదు 160..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price: టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో దానిని కొనుగోలు చేయడమే మానేశారు. గత రెండు వారాల్లో దేశంలోని వివిధ నగరాల్లో టమాటా ధర జెట్ స్పీడ్ వేగంతో పెరిగి 100ను దాటింది. దీంతో కొన్ని నగరాల్లో కిలో రూ.120 ధరకు విక్రయించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు టమోటాలు మరింత ఖరీదైనవిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో టమోటా రిటైల్ ధర కిలో రూ. 160కి చేరుకుంది. అకాల వర్షాలు కూరగాయలపై చెడు ప్రభావం చూపాయి. ఈ కారణంగా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అందులో ఎక్కువగానైతే టమోటాల ధరలు మండిపోతున్నాయి. తక్కువ దిగుబడి రావడం, వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో డిమాండ్ మేరకు సరఫరా చేయడం లేదు. దీంతో టమాట ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భోపాల్లోని విఠల్ మార్కెట్లో టమోటా ధర ఇప్పటికే అత్యధికంగా కిలో రూ.140 ఉండగా.. ఆదివారానికి ఆ ధర రూ.160కి చేరుకుంది.
Telugu Movies this week: ఈ వారం సినీ లవర్స్కి పండగే ఏకంగా 34 రిలీజులు
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
మరోవైపు టొమాటోతో పాటు ఉల్లి, బంగాళదుంప, బెండకాయ, అల్లం, పచ్చిమిర్చి-పచ్చికొత్తిమీర కూడా ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మిర్చి, కొత్తిమీర హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.125కు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వర్షం, తుపాను ప్రభావంతో కిలో అల్లం ధర రూ.200-250కి చేరింది. ఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో బీన్స్ కిలో రూ.110-120, క్యారెట్ రూ.100, క్యాప్సికం కిలో రూ.80కి విక్రయించారు. మొత్తంమీద గత రెండు వారాల్లో చాలా కూరగాయల ధరలు రిటైల్ మరియు హోల్సేల్ మార్కెట్లో పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టమాటా ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టొమాటో గ్రాండ్ ఛాలెంజ్ను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రపంచంలోనే టొమాటో ఉత్పత్తిలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.
Dhanush: రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగిందయ్యా..
మరోవైపు గత గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు ధర పలికింది. కిలో టమాటా రూ.124 లకు పెరిగింది. సాధారణంగా మదనపల్లె మార్కెట్ కు రోజుకు 1500 టన్నుల టమాటా వస్తుంది. పచ్చి మిర్చి అయితే ఏకంగా రూ.160 చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో పచ్చి మిర్చి ధర రూ.140 నుంచి రూ.160 పలుకుతోంది. జనలు పచ్చి మిర్చి కొనడమే మానేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీతో రైతులకు టమాటాలు అందిస్తోంది. 50 రాయితీతో రైతు బజార్ల ద్వారా టమాటాలను అమ్ముతోంది. కడప, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. కాగా త్వరలోనే ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనుంది.
తాజావార్తలు
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?