Tomato Price: రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. ఇప్పుడు కేజీ 120 కాదు 160..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price: టమాటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో దానిని కొనుగోలు చేయడమే మానేశారు. గత రెండు వారాల్లో దేశంలోని వివిధ నగరాల్లో టమాటా ధర జెట్ స్పీడ్ వేగంతో పెరిగి 100ను దాటింది. దీంతో కొన్ని నగరాల్లో కిలో రూ.120 ధరకు విక్రయించడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు టమోటాలు మరింత ఖరీదైనవిగా మారాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో టమోటా రిటైల్ ధర కిలో రూ. 160కి చేరుకుంది. అకాల వర్షాలు కూరగాయలపై చెడు ప్రభావం చూపాయి. ఈ కారణంగా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అందులో ఎక్కువగానైతే టమోటాల ధరలు మండిపోతున్నాయి. తక్కువ దిగుబడి రావడం, వర్షం కారణంగా పంట దెబ్బతినడంతో డిమాండ్ మేరకు సరఫరా చేయడం లేదు. దీంతో టమాట ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భోపాల్లోని విఠల్ మార్కెట్లో టమోటా ధర ఇప్పటికే అత్యధికంగా కిలో రూ.140 ఉండగా.. ఆదివారానికి ఆ ధర రూ.160కి చేరుకుంది.
Telugu Movies this week: ఈ వారం సినీ లవర్స్కి పండగే ఏకంగా 34 రిలీజులు
Also Read
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
మరోవైపు టొమాటోతో పాటు ఉల్లి, బంగాళదుంప, బెండకాయ, అల్లం, పచ్చిమిర్చి-పచ్చికొత్తిమీర కూడా ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మిర్చి, కొత్తిమీర హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.125కు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా వర్షం, తుపాను ప్రభావంతో కిలో అల్లం ధర రూ.200-250కి చేరింది. ఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో బీన్స్ కిలో రూ.110-120, క్యారెట్ రూ.100, క్యాప్సికం కిలో రూ.80కి విక్రయించారు. మొత్తంమీద గత రెండు వారాల్లో చాలా కూరగాయల ధరలు రిటైల్ మరియు హోల్సేల్ మార్కెట్లో పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న టమాటా ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టొమాటో గ్రాండ్ ఛాలెంజ్ను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రపంచంలోనే టొమాటో ఉత్పత్తిలో భారతదేశం రెండవ అతిపెద్ద దేశంగా ఉంది.
Dhanush: రామ్ దేవ్ బాబా లుక్ కు మోక్షం కలిగిందయ్యా..
మరోవైపు గత గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో టమాటా ధర రికార్డు ధర పలికింది. కిలో టమాటా రూ.124 లకు పెరిగింది. సాధారణంగా మదనపల్లె మార్కెట్ కు రోజుకు 1500 టన్నుల టమాటా వస్తుంది. పచ్చి మిర్చి అయితే ఏకంగా రూ.160 చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో పచ్చి మిర్చి ధర రూ.140 నుంచి రూ.160 పలుకుతోంది. జనలు పచ్చి మిర్చి కొనడమే మానేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీతో రైతులకు టమాటాలు అందిస్తోంది. 50 రాయితీతో రైతు బజార్ల ద్వారా టమాటాలను అమ్ముతోంది. కడప, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చారు. కాగా త్వరలోనే ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనుంది.
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!