Kedar Selagamsetty: షాకింగ్: అల్లు అర్జున్ సన్నిహిత నిర్మాత మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన యంగ్ నిర్మాత అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా నిర్మించిన నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో మరణించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈవెంట్కు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారు కేదార్ సెలగంశెట్టి. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు కేదార్ సెలగంశెట్టి.. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు దుబాయ్ అధికారులు.. చాలా యుక్త వయసులోనే ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు. కేదార్ అల్లు అర్జున్ బన్నీ వాసు సహా విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది. బన్నీ వాసు ప్రోద్బలంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన గతంలో ముత్తయ్య అనే సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు.
Serial Actress: కదులుతున్న రైలులో నటికి షాక్.. పోలీసులే ఇలా చేస్తే ఎలా?
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
తర్వాత ఆనంద దేవరకొండతో గమ్ గమ్ గణేశా అనే సినిమా నిర్మించాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కూడా కేదార్ బ్యానర్ లోనే తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటికే సుకుమార్కి ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆయన మరణానికి సంబంధించిన వార్త ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాలకు షాక్ కలిగిస్తోంది. ప్రస్తుతానికి సినీ పరిశ్రమకు చెందిన చాలామంది దుబాయిలోనే ఉన్నారు. ఓ నిర్మాత కొడుకు పెళ్లికి దుబాయ్ వెళ్లినవారు ఆ పెళ్లి చూసుకొని ప్రస్తుతం కొంతమంది వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటే మరి కొంతమంది తిరిగి వచ్చారు. అయితే ఆ వివాహానికి కేదార్ వెళ్ళాడా లేక ఇటీవల జరిగిన పాక్- ఇండియా మ్యాచ్ కోసం వెళ్ళాడా అనే విషయం మీద క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..