MLA Rakshana Nidhi: టీడీపీతో టచ్లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! రాజీనామాకు రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Rakshana Nidhi: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది.. మార్పులు, చేర్పుల్లో భాగంగా కొందరి సిట్టింగ్లను సైతం వైసీపీ పక్కన పెడుతోంది.. కొందరి స్థానాలను మారుస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. అయితే ఈ మార్పుల్లో కొందరు సిట్టింగ్ల సీట్లు గల్లంతు అవుతున్నాయి. దీంతో.. ఇతర పార్టీల నేతలతో టచ్లోకి వెళ్లిపోతున్నారు.. ఈ క్రమంలోనే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధికి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయట.. ఈ పరిణామాలో 25 రోజులుగా తిరువూరు నియోజకవర్గానికి దూరంగా స్వస్థలం తోట్లవల్లూరులో ఉంటున్నారు.. ఇప్పటికే వైసీపీ మూడు లిస్ట్లు విడుదల చేయగా.. నాల్గో లిస్ట్పై కసరత్తు చేస్తోంది.. అయితే, ఫోర్త్ లిస్ట్ లో పేరు లేకపోతే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే రక్షణ నిధికి టచ్లోకి వెళ్లిందట తెలుగుదేశం పార్టీ.. ఇక, ఆయన పామర్రు టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
Read Also: Telangana Govt: ఆరిజన్ లైఫ్ సైన్స్ తో రూ.2000 కోట్ల డీల్ కుదుర్చుకున్న తెలంగాణ సర్కార్
Also Read
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణనిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పేసినట్లు సమాచారం. తిరువూరు నుంచి రెండు సార్లు విజయం సాధించిన తనకు టికెట్ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణ నిధి ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. పార్టీలోనే ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలను రక్షణనిధి వద్దకు పంపినట్లు తెలిసింది. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు జరిపినప్పటికీ.. రక్షణనిధి మాత్రం పార్టీలో కొనసాగేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలంటే తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందేనని, లేదంటే మరోపార్టీ చూసుకుంటానంటూ తెగేసి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.. మరి ఫోర్త్ లిస్ట్ వచ్చేవరకు ఉంటారా? ఈ లోపే టీడీపీలో చేరతారా? అనే విషయం తెలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!