Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై స్పందించిన తిలక్
- గ్రౌండ్లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదు
- అందరం అర్ష్దీప్ను ఫాలో అయ్యాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై తెలుగు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు. సెప్టెంబర్ 28న పాకిస్థాన్తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపాము అని, గ్రౌండ్లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు. అందుకే ట్రోఫీ అందుకొన్నట్లుగా తాము క్రియేట్ చేశాం అని తిలక్ తెలిపాడు. ఫైనల్లో భారత్ గెలిచినా.. నఖ్వీ ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వని విషయం తెలిసిందే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ మాట్లాడుతూ…’దుబాయ్ మైదానంలో అందరం ఆసియా కప్ 2025 ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాం. దాదాపు గంట గడిచినా ట్రోఫీ మా చేతికి రాలేదు. అందరూ టీవీల్లో చూసుంటారు. టీమిండియా ప్లేయర్స్ చాలామంది మైదానంలోనే పడుకొని ఉన్నాం. అర్ష్దీప్ సింగ్ మాత్రం రీల్స్ చేస్తూ అందరిని అలరించాడు. మైదానంలో ఎక్కడా కూడా మాకు ట్రోఫీ కనిపించలేదు. చాలా సమయం అయ్యాక.. అర్ష్దీప్ ట్రోఫీ అందుకొన్నట్లుగా క్రియేట్ చేశాడు. అందరం అతడిని ఫాలో అయ్యాం. టీ20 ప్రపంచకప్ 2024 సమయంలో ఎలా సంబరాలు చేసుకున్నామో ట్రోఫీ లేకున్నా అలాగే చేశాం’ అని తెలిపాడు.
Also Read
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Punjab Blasts: పంజాబ్లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
- Tamil Nadu Politics: నిమిషానికో మలుపు.. విజయ్ మాస్టార్ ప్లాన్.. ఏఐఏడీఎంకేతో చర్చలు!
Also Read: Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది మావా ఈ రచ్చ?
ఆసియా కప్ 2025 ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ మరో రెండు బంతులు ఉండగానే 5 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 20 పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయిన టీమిండియాను తిలక్ వర్మ ఆదుకున్నాడు. 53 బంతుల్లో 69 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత ప్లేయర్స్ నిరాకరించారు. దాంతో నఖ్వీ ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో పెట్టి పాక్ వెళ్ళిపోయాడు. ఏ బీసీసీఐ అధికారి అయినా లేదా భారత ఆటగాడు అయినా తన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవచ్చు అని కండిషన్ పెట్టాడు. ఇందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్దమైంది.
తాజావార్తలు
-
Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..
-
Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు?
-
Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్ప్లే, GPS ఫీచర్లతో అదిరింది
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
-
Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!