IND vs AUS: విశాఖ టీ-20 మ్యాచ్కు రేపటి నుంచే టికెట్ల విక్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: ఈనెల 23న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకాలు 15, 16 తేదీల్లో పేటీఎం (ఇన్సైడర్.ఇన్) ద్వారా ఉ. 11.00 గం. నుంచి జరుగుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి తెలిపారు. అలాగే 17, 18 తేదీల్లో ఆఫ్లైన్లో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్గాంధీ ఇండోర్ స్టేడియంలలో ఉదయం పది గంటల నుంచి ఆఫ్లైన్ టికెట్లు విక్రయిస్తారని ఆయన తెలిపారు. ఆఫ్ లైన్లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే ఇస్తామన్నారు. కలెక్టర్ అనుమతితో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారన్నారు. రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్లో పేటిఎం ఇన్సైడర్.ఇన్ వెబ్ సైట్లో 10,500 వరకూ టిక్కెట్లు విక్రయాలు జరుపుతామన్నారు.17,18 తేదీల్లో ఆఫ్ లైన్లో 11,500 టిక్కెట్లు విక్రయాలు జరుగుతాయన్నారు. బీసీసీఐ షరతులు ప్రకారం కాంప్లిమెంటరిగా 5,300 టికెట్లు జారీ చేస్తామన్నారు.
Also Read: MP Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి..
Also Read
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
- Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
ఈ మ్యాచ్కోసం 1500 మంది పోలీసులతో బందోబస్తు సిద్ధం చేశామని డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని ఆయన తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలని క్రీడాభిమానులకు సూచించారు. మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలన్నారు. టికెట్స్ కలర్ జిరాక్స్లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించామని ఆయన చెప్పారు. బౌన్సర్లకి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తామన్నారు. బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వయిరీ చేసి ఐడీ కార్డు జారీ చేస్తామని డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!