Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
- తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం..
- 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
- ఆలస్యంగా వెలుగులోకి విషయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బార్గూర్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిక ఇంటికి వెళ్లి తల్లిని నిలదీశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భవతి అని పాఠశాలలో పనిచేసే ఇద్దరు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఒక ఇంటర్మీడియట్ టీచర్ తన కుమార్తెను సామూహికంగా అత్యాచారం చేశారని తల్లి కన్నీరుమున్నీరైంది.
Also Read: Indore: నలుగురు యువకుల అరాచకం.. ఎస్సైపై దాడి (వీడియో వైరల్)
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
వెంటనే బాలిక తల్లిని జిల్లా శిశు సంరక్షణ అధికారికి ఫిర్యాదు చేయమని ప్రధానోపాధ్యాయుడు సూచించాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బాలికను ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై జిల్లా శిశు సంరక్షణ అధికారి బార్గూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న బార్గూర్కు చెందిన చిన్నసామి (57), మత్తూరుకు చెందిన ఆరుముగం (45), వేలంపాటికి చెందిన ప్రకాష్ (37) అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీని కారణంగా బాలిక గర్భవతి అయినట్లు తేలింది. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పాఠశాలను ముట్టడించి ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సీరియస్గా స్పందించారు. ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!