Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
- తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం..
- 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
- ఆలస్యంగా వెలుగులోకి విషయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బార్గూర్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక పాఠశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలిక ఇంటికి వెళ్లి తల్లిని నిలదీశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భవతి అని పాఠశాలలో పనిచేసే ఇద్దరు గ్రాడ్యుయేట్ టీచర్లు, ఒక ఇంటర్మీడియట్ టీచర్ తన కుమార్తెను సామూహికంగా అత్యాచారం చేశారని తల్లి కన్నీరుమున్నీరైంది.
Also Read: Indore: నలుగురు యువకుల అరాచకం.. ఎస్సైపై దాడి (వీడియో వైరల్)
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
వెంటనే బాలిక తల్లిని జిల్లా శిశు సంరక్షణ అధికారికి ఫిర్యాదు చేయమని ప్రధానోపాధ్యాయుడు సూచించాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు బాలికను ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై జిల్లా శిశు సంరక్షణ అధికారి బార్గూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనితో పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలో పనిచేస్తున్న బార్గూర్కు చెందిన చిన్నసామి (57), మత్తూరుకు చెందిన ఆరుముగం (45), వేలంపాటికి చెందిన ప్రకాష్ (37) అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీని కారణంగా బాలిక గర్భవతి అయినట్లు తేలింది. దీంతో పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పాఠశాలను ముట్టడించి ధర్నాకు దిగారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సీరియస్గా స్పందించారు. ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
తాజావార్తలు
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..