Farooq Abdullah: న్యాయం జరిగేవరకు జమ్మూలో హత్యలు ఆగవు.. ఫరూక్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farooq Abdullah: కశ్మీర్లో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న హత్యలు న్యాయం జరిగే వరకు కొనసాగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్కు న్యాయం జరిగేవరకు ఈ దాడులు ఆగవన్నారు. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ, లోయలో హత్యలు ఎందుకు ఆగలేదని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు లోయలో హత్యలు జరుగుతూనే ఉంటాయని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
గతంలో ఆర్టికల్ 370 వల్ల దాడులు జరుగుతున్నాయని కొందరు చెప్పారని బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు అది రద్దు అయింది. అయినప్పటికీ ఇలాంటి హత్యలను ఎందుకు ఆపడం లేదు? బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ఇలాంటి హత్యలకు ఆర్టికల్ 370 కారణమైతే, అమాయక కశ్మీరీ పండిట్ పురాన్ క్రిషన్ భట్ ఎందుకు హత్యకు గురయ్యారని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఈ హత్యకు ఏదో కారణం ఉండి ఉంటుందని, బయటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఆర్టికల్ 370 ఈ హత్యలకు కారణం కాదని చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికడితేనే ఇలాంటి హత్యలు ఆగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దానికి సైనికపరంగానే మార్గం వెతకాలన్నారు. కాగా, శనివారం జరిగిన ఉగ్రకాల్పుల్లో కశ్మీరి పండిట్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ స్పందిస్తూ దాడికి పాల్పడిన బాధ్యులను విడిచిపెట్టేది లేదని అన్నారు.
Also Read
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
ఇలా చంపుకుంటూ పోతే జమ్మూకశ్మీర్ లోయ మాత్రమే ఉంటుందని ఇంకేమీ ఉండదని ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కాశ్మీరీ పండిట్లపై వరుస దాడులు చోటు చేసుకోవడంపై ఆయన స్పందించారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై జమ్మూలోని అబ్దుల్లా నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. మరో వైపు కేంద్రం ఈ దాడులను సీరియస్గా తీసుకుంది.
Congress Presidential Poll: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. గెలిచేది ఆయనేనట!
శనివారం నాడు, షోపియాన్లోని పండ్లతోటకు వెళుతుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కాశ్మీరీ పండిట్ పూరన్ క్రిషన్ భట్ మరణించాడు. భట్ను ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు ప్రకటించారు. కుట్ర చేసిన దోషుల అంతం మట్టికరిపిస్తామని జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా అన్నారు. షోపియాన్ జిల్లాలో కాశ్మీరీ పండిట్ను హతమార్చడానికి కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించిందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..