Maha Kumbh: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. మూడోసారి
- మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం
- లవకుష్ ధామ్ శిబిరంలో ప్రమాదం
- సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ప్రయాగ్ రాజ్లో మహా కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తున్నారు. దీంతో.. ప్రయాగ్ రాజ్ జన సంద్రంగా మారుతోంది. శనివారం మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. మూడోసారి జరిగిన అగ్నిప్రమాదం లవకుష్ ధామ్ శిబిరంలో జరిగినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అగ్నిప్రమాదం కారణంగా అనేక మండపాలు కాలిపోయాయి. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదు.
Read Also: Kerala: చర్చి స్థలంలో బయటపడ్డ ఆలయ అవశేషాలు.. చర్చి నిర్వాహకులు ఏం చేశారంటే?
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
మహా కుంభమేళాలో అగ్ని ప్రమాద ఘటన జరగడం మొదటిసారి కాదు.. ఫిబ్రవరి 9న సెక్టార్-23లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం సంబవించింది. దీంతో వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. 2025 జనవరి 30న మొదటిసారి అగ్నిప్రమాదం జరిగింది. ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి, దాదాపు పది టెంట్లు దగ్ధమయ్యాయి. మొత్తం మీద, మహా కుంభమేళా ప్రారంభం నుంచి అనేక అగ్నిప్రమాదాలు సంభవించాయి. 2025 జనవరి 19న గోరఖ్పూర్లోని గీతా ప్రెస్ క్యాంప్లో జరిగిన అగ్నిప్రమాదంలో 150కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆ అగ్నిప్రమాదానికి గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణమని తెలుస్తోంది, కానీ గీతా ప్రెస్ వ్యక్తులు మాత్రం అగ్నిప్రమాదం బయటి మూలాల వల్ల జరిగిందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదాలు అందరికీ చిగురుటాకులుగా మారాయి. తదుపరి చర్యల పట్ల ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Read Also: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!