Maha Kumbh: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. మూడోసారి
- మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం
- లవకుష్ ధామ్ శిబిరంలో ప్రమాదం
- సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ప్రయాగ్ రాజ్లో మహా కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే కాదు ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది భక్తులు తరలివస్తున్నారు. దీంతో.. ప్రయాగ్ రాజ్ జన సంద్రంగా మారుతోంది. శనివారం మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. మూడోసారి జరిగిన అగ్నిప్రమాదం లవకుష్ ధామ్ శిబిరంలో జరిగినట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదంపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి కృషి చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అగ్నిప్రమాదం కారణంగా అనేక మండపాలు కాలిపోయాయి. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన సమాచారం లేదు.
Read Also: Kerala: చర్చి స్థలంలో బయటపడ్డ ఆలయ అవశేషాలు.. చర్చి నిర్వాహకులు ఏం చేశారంటే?
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
మహా కుంభమేళాలో అగ్ని ప్రమాద ఘటన జరగడం మొదటిసారి కాదు.. ఫిబ్రవరి 9న సెక్టార్-23లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా అగ్నిప్రమాదం సంబవించింది. దీంతో వెంటనే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. 2025 జనవరి 30న మొదటిసారి అగ్నిప్రమాదం జరిగింది. ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి, దాదాపు పది టెంట్లు దగ్ధమయ్యాయి. మొత్తం మీద, మహా కుంభమేళా ప్రారంభం నుంచి అనేక అగ్నిప్రమాదాలు సంభవించాయి. 2025 జనవరి 19న గోరఖ్పూర్లోని గీతా ప్రెస్ క్యాంప్లో జరిగిన అగ్నిప్రమాదంలో 150కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆ అగ్నిప్రమాదానికి గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణమని తెలుస్తోంది, కానీ గీతా ప్రెస్ వ్యక్తులు మాత్రం అగ్నిప్రమాదం బయటి మూలాల వల్ల జరిగిందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదాలు అందరికీ చిగురుటాకులుగా మారాయి. తదుపరి చర్యల పట్ల ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Read Also: NTR Trust Euphoria Musical Night: యుఫోరియా కన్సర్ట్’కి బాలయ్య, పవన్.. ఫ్రేమ్ అదిరిందిగా!
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!