Thief Arrest : తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.. ఆ దొంగే అరెస్ట్..
రాత్రి సమయాల్లో తాళం వేసివున్న ఇండ్లతో పాటు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల్లో ఒకరిని గీసుగొండ పోలీసులు సోమవారం అరెస్ట్ చేయగా మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు అరెస్టు చేసిన దొంగ నుండి ఆరు లక్షల రూపాయల విలువ గల వందగ్రాముల బంగారు, వందగ్రాముల వెండి కారు, ద్విచక్రవాహనం, ల్యాప్ టాప్, ఎల్.ఈ.డి టివి, మూడు సెల్ ఫోన్లతో పాటు పదిహేను వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా, కాశీబుగ్గ ఎస్.ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఆలియాస్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఇదే ప్రాంతానికి చెందిన మరో నిందితుడు ఈరెల్లి రఘు ఆలియాస్ కున్ను ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ ఆటో నడుపుతూ మద్యం జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనితో నిందితుడికి ఆటో నడపడం ద్వారా వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో సులవుగా డబ్బు సంపాదించేందుకు నిందితుడు చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా నిందితుడు రాత్రి సమయాల్లో తన ద్విచక్రవాహనం రిజిష్టన్ నంబర్ ప్లెట్ స్థానంలో డాక్టర్, ప్రెస్ లోగోలతో కూడిన నంబర్ ప్లెట్లను మారుస్తూ తాళం వేసిన ఇండ్లతో పాటు, గుళ్ళల్లోని హుండీలోని సొత్తు చోరీ చేసేవాడు. నిందితుడు ఇలా ఒంటరిగా ఎనిమిది చోరీలకు పాల్పడగా చోరీ చేసిన సొత్తును తన ఇంటిలో భద్రపర్చి తన అవసరాల కొద్ది చోరీ సొత్తును అమ్మి సొమ్ము చేసుకోనేవాడు.
Also Read
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ఒంటరిగా చోరీలకు పాల్పడతున్న నిందితుడుకి కాశీబుగ్గ ఎస్.ఆర్ నగర్ నివాసం వుంటున్న తన మిత్రుడు ప్రస్తుతం పరారీలో వున్న నిందితుడు ఈరెల్లి రఘుతో కల్సి మరో నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 చోరీలకు పాల్పడగా ఇందులో ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ అత్యధికంగా ఆరు చోరీలకు పాల్పడగా గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, సుబేదారి కేయూసి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మీ సూచన మేరకు దర్యాప్తు చేపట్టిన గీసుగొండ మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల వద్ద అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం గొర్రెకుంట ప్రాంతంలో గీసుగొండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల తన సిబ్బందితో కల్సి తనీఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు యాకూబ్ పాషా ద్విచక్రవాహనంపై వస్తుండగా అనుమానంతో పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకోని విచారించగా నిందితుడు పాల్పడిన చోరీలను అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మెరకు నిందితుడి ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మామూనూర్ ఏసిపి నరేష్ కుమార్, గీసుగొండ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్ కుమార్, శ్రీనివాస్, గీసుగొండ ఎస్.ఐ వెంకన్న, గీసుగొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంకట్ రెడ్డి, సారయ్య, దామోదర్, కిషన్ రావు, పవన్ కుమార్ మరియు కిషన్లను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించారు.
తాజావార్తలు
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!