Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story These Are The Team India Player Of The Match Winners

World Cup 2023: టీమిండియాలో ఇప్పటివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది వీరినే..

Published Date :November 16, 2023 , 6:07 pm
By Rajesh Veeramalla
World Cup 2023: టీమిండియాలో ఇప్పటివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది వీరినే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐసీసీ ప్రపంచ కప్ 2023.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి చాలా మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందారు. రోహిత్ శర్మ ఇప్పటివరకు రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ ప్రపంచకప్ లో ఆడిన మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు టీమిండియా తరుఫున క్రికెటర్లలో ఎవరెవరిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును వరించిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also: Husband Kills Wife: భార్యను టూర్‌కి తీసుకెళ్లి స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు..

Also Read

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
  • Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..

కేఎల్ రాహుల్..
ఈ టోర్నీలో టీమిండియా మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగింది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 97 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. దీంతో రాహుల్ ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది.

రోహిత్ శర్మ..
ఈ టోర్నీలో టీమిండియా రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్తాతో తలపడింది. ఈ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 131 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రోహిత్ ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది.

జస్ప్రీత్ బుమ్రా..
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో బుమ్రా.. 7 ఓవర్లు వేసి 2 కీలక వికెట్లు తీశాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది.

విరాట్ కోహ్లీ
టోర్నీ నాల్గవ మ్యాచ్ లో.. బంగ్లాదేశ్ తో టీమిండియా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. 103 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడటంతో కోహ్లీని ఈ అవార్డు వరించింది.

మహమ్మద్ షమీ
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ తో మహమ్మద్ షమీ.. ఈ టోర్నీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇవ్వడం మాములుగా లేదు. ఏకంగా 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 ఓవర్లలో 5 కీలక వికెట్లు తీశాడు. అంతేకాకుండా.. ఒక ఓవర్ మెయిడిన్ కూడా చేశాడు. దీంతో షమీకి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

రోహిత్ శర్మ
ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 101 బంతుల్లో 87 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో రోహిత్ కు రెండో అవార్డు.

మహమ్మద్ షమీ
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో షమీ మళ్లీ చెలరేగాడు. 5 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా అందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉంది. దీంతో షమీకి రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడి శతకం సాధించాడు. 121 బంతుల్లో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోహ్లీకి ఈ మ్యాచ్ లో రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

శ్రేయాస్ అయ్యర్
లీగ్ చివరి మ్యాచ్ టీమిండియా-నెదర్లాండ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ శతకం బాదాడు. కేవలం 94 బంతుల్లోనే 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో అయ్యర్ ను ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

మహమ్మద్ షమీ
తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా-న్యూజిలాండ్ తలపడింది. ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమీ రికార్డు సృష్టించాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే ఎవరూ సాధించలేని అరుదైన ఘనతను షమీ సాధించాడు. కివీస్ బౌలర్లను కట్టడి చేయడంతో పాటు.. కీలకమైన 7 వికెట్లను తీశాడు. 9 5 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు సాధించాడు. దీంతో ఈ టోర్నీలోనే షమీని మూడోసారి ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • awards
  • player of the match
  • Team India
  • telugu news
  • World Cup 2023

తాజావార్తలు

  • Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..

  • Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!

  • Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్‌.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల

  • Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

  • Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions