Crime News: వృద్ధుణ్ని చంపి.. ముక్కలు చేసి అటవీలో పడేసిన యువజంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో ఓ మనిషిని చంపడం సర్వసాధారణం అయిపోయింది. చంపడమే కాకుండా.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నిర్మానుష్య ప్రదేశాలలో పడేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ.. ఢిల్లీలో తన ప్రేయసి శ్రద్ధ వాకర్ ను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసి ముక్కలుగా చేసి ఇంట్లో ఫ్రీడ్జ్ లో పెట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత ఇంచుమించు ఇలాంటి హత్యలే ఎక్కుగా మనకు కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళలో జరిగింది.
Also Read : Yoga Mahotsav: రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలి.. యోగా మహోత్సవ్ లో గవర్నర్..
Also Read
కేరళలోని కోజికోడ్ జిల్లాలో సిద్ధిఖ్ అనే హోటల్ యజమానిని ఓ యువజంట అత్యంత దారుణంగా చంపారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీబ్యాగులో తీసుకువెళ్లి అటవీప్రాంతంలో విసిరేశారు. అయితే నిందితులను పోలీసులు శుక్రవారం చెన్నైలో అరెస్ట్ చేసి కేరళ పోలీసులకు అప్పగించారు. సిద్ధిఖ్ వ్యాపార నిమిత్తం కుటుంబసభ్యులకు దూరంగా కోజికోడ్ జిల్లాలోనే నివాసం ఉంటున్నాడు.
Also Read : Speed Train : ఇకనుంచి గాల్లో ఎగిరే రైళ్లు రాబోతున్నాయ్
ఈ క్రమంలో మే 18న కోజికోడ్లోని ఎరంజిపాలెంలో ఉన్న ఓ హోటలులో రెండు గదులను ( బి3, బి4 ) ఆయన బుక్ చేసుకున్నారు. అదే హోటలులో పాలక్కడ్కు చెందిన నిందితులు శిబిల్, ఫర్హానాపై అంతస్తులో అద్దెకు దిగారు. మే 19న శిబిల్, ఫర్హానా ఓ ట్రాలీబ్యాగుతో కిందకు దిగిన విజువల్స్ హోటల్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ తర్వాత వీరు ముగ్గురూ కనిపించకుండా పోయారు. సిద్ధిఖ్కు అతడి కుమారుడు చాలాసార్లు ఫోను చేసినా అతని మొబైల్ స్విచ్ఆఫ్ వచ్చింది.
Also Read : Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
అయితే అదే సమయంలో అతడి ఫోనుకు తండ్రి కార్డుతో లక్ష రూపాయలు విత్ డ్రా చేసినట్లుగా ఏటీఎం నుంచి మేసెజ్ లు రావడంతో అనుమానంతో సిద్ధిఖ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల విచారణలో సిద్ధిఖ్ హత్య విషయం బయటపడింది. ప్రధాన నిందితుడైన శిబిల్ గతంలో సిద్ధిఖ్ హోటలులో పనిచేశాడు. అతడి ప్రవర్తన నచ్చక పనిలో నుంచి తీసివేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. అయితే ఈ హత్య వెనుక ఏదైనా హనీట్రాప్ ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
-
Vijay : విజయ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!