Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు
- సూర్యాపేట జిల్లాలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగం
- తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని ఏడ్చేసిన విద్యార్థులు
- మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు
- ఉపాధ్యాయుడు సైదులును పట్టుకొని ఏడ్చిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు అని చెబుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే గురువులు మాత్రం ఆ జీవితానికి పరమార్థం చూపి సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. గురువులు సభ్య సమాజంలో ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని నేర్పుతూ ఉంటారు. అందుకే విద్యార్థులకు గురువులకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది. అయితే ఎక్కడ చదువుకున్నా.. ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. మనకు చదువు చెప్పిన గురువులు కనిపించారూ అంటే ఒక గౌరవప్రదమైన నమస్కారం చేస్తాం. అంతలా గురువులు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు.
Read Also: NTA: ఏం చేద్దాం చెప్పండి.. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్ని కోరిన కేంద్రం..
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
అయితే ఇక కొంత మంది ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు మరింత అమితమైన ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. ఇలాంటి పంతులు తమకు దొరకడం ఎంతో అదృష్టం అంటూ భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఉపాధ్యాయుల చివరికి బదిలీ అయ్యి వెళ్లిపోతున్నారూ అని తెలిస్తే ఆ విద్యార్థులు గుండె బద్దలయినంత పని అవుతూ ఉంటుంది. తాజాగా.. సూర్యాపేట జిల్లాలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని విద్యార్థులు ఏడ్చేశారు. ఈ ఘటన మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులును పట్టుకొని విద్యార్థులు ఏడ్చేశారు.
Read Also: Minister Sandhya Rani: మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మెంతబోయిన సైదులు బదిలీపై వెళ్తుండడంతో.. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకొని విద్యార్థులు ఏడ్చారు. అంతేకాకుండా.. ఉపాధ్యాయుడి కాళ్ళ మీద పడి మరి వెళ్ళిపోవద్దంటూ ప్రాధేయపడ్డారు.
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!