Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు
- సూర్యాపేట జిల్లాలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగం
- తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని ఏడ్చేసిన విద్యార్థులు
- మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు
- ఉపాధ్యాయుడు సైదులును పట్టుకొని ఏడ్చిన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువు అని చెబుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే గురువులు మాత్రం ఆ జీవితానికి పరమార్థం చూపి సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. గురువులు సభ్య సమాజంలో ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని నేర్పుతూ ఉంటారు. అందుకే విద్యార్థులకు గురువులకు మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది. అయితే ఎక్కడ చదువుకున్నా.. ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. మనకు చదువు చెప్పిన గురువులు కనిపించారూ అంటే ఒక గౌరవప్రదమైన నమస్కారం చేస్తాం. అంతలా గురువులు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు.
Read Also: NTA: ఏం చేద్దాం చెప్పండి.. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో పేరెంట్స్ని కోరిన కేంద్రం..
Also Read
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
అయితే ఇక కొంత మంది ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు మరింత అమితమైన ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. ఇలాంటి పంతులు తమకు దొరకడం ఎంతో అదృష్టం అంటూ భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఉపాధ్యాయుల చివరికి బదిలీ అయ్యి వెళ్లిపోతున్నారూ అని తెలిస్తే ఆ విద్యార్థులు గుండె బద్దలయినంత పని అవుతూ ఉంటుంది. తాజాగా.. సూర్యాపేట జిల్లాలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ను పట్టుకుని విద్యార్థులు ఏడ్చేశారు. ఈ ఘటన మద్దిరాల (మం) పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మెంతబోయిన సైదులును పట్టుకొని విద్యార్థులు ఏడ్చేశారు.
Read Also: Minister Sandhya Rani: మన్యం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చూసి పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు. వివరాల్లోకెళ్తే.. పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మెంతబోయిన సైదులు బదిలీపై వెళ్తుండడంతో.. తమను వదిలి వెళ్లిపోవద్దంటూ టీచర్ ను పట్టుకొని విద్యార్థులు ఏడ్చారు. అంతేకాకుండా.. ఉపాధ్యాయుడి కాళ్ళ మీద పడి మరి వెళ్ళిపోవద్దంటూ ప్రాధేయపడ్డారు.
తాజావార్తలు
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!