Sankranti 2025: పల్లెకు బైబై.. మళ్లీ పట్నం బాట.. రద్దీగా హైవేలు..
- ముగిసిన సంక్రాంతి పండుగ సంబరాలు..
- భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో తిరుగు ప్రయాణం..
- పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టిన ప్రజలు..
- రద్దీగా మారిన హైవేలు.. టోల్ గేట్ల దగ్గర రద్దీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranti 2025: సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండుగ పూట సొంత ఊరు వెళ్లి.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు.. ఇక, కోళ్ల పందాలు, గుండాట ఇలా పలు రకాల ఆటల్లో పాల్గొన్నారు.. కొందరు డబ్బులు పోగొట్టుకుంటే.. మరికొందరు డబ్బులు కొన్ని వెనకేసుకున్నారు.. మరోవైపు.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
Read Also: Maha Kumbh Mela 2025: కుంభమేళా బాట పట్టిన ఏరోస్పేస్ ఇంజనీర్.. ఎవరు ఈ మసాని గోరఖ్
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
దీంతో.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది.. సంక్రాంతి సంబరాలు ముగించుకొని హైదరాబాద్ తిరుగుప్రయాణం చేసే ప్రయాణికుల వాహనాలతో రద్దీగా మారిపోయాయి హైవేపై ఉన్న టోల్ గేట్లు.. గత మూడురోజులు సంబరాలు ముగిసిపోవడంతో తిరుగు ప్రయాణం అయ్యారు పట్టణవాసులు.. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి.. పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు కూడా తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు.. హైదరాబాద్కు ఈనెల 19 వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు రాజమండ్రి ఆర్టీసీ అధికారులు.. శని, ఆదివారాల్లో ప్రతి ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. మరోవైపు.. మొన్నటి వరకు వెళ్లేవారికి.. ఇప్పుడు సంక్రాంతికి వచ్చి తిరిగి వెళుతున్న ప్రయాణికులనుంచి టికెట్ల అధిక రేట్లతో దోపిడీ చేసే పనిలో పడిపోయాయి ప్రైవేట్ ట్రావెల్స్..
Read Also: Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు!
అయితే, సంక్రాంతి పండుగ ముగించుకుని నగరవాసుల తిరుగుపయనం పట్ల ప్రత్యేక ఏర్పాట్లుకు ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ప్రయాణికుల జాగ్రత్తలపై అధికారులను ఆదేశించారు.. విజయవాడ నుండి ఇప్పటికే పలు ప్రత్యేక ఏర్పాటు చేశామని.. ప్రయాణికులు అందరూ రవాణా భద్రతలు పాటించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మరోవైపు.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు నడుతపున్నారు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా స్పెషల్ సర్వీసులు నడుస్తున్నాయి.
తాజావార్తలు
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!