Anna Canteens: ముస్తాబవుతున్న అన్న క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ
- ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్నా క్యాంటిన్లు ప్రారంభం
- రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న అందుబాటులోకి 100 అన్నా క్యాంటీన్లు
- ఈ నెల 10నాటికి సిద్ధం చేయాలని ఆదేశం
- రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లల్లో ఆహర సరఫరా చేపట్టనున్న హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్
- అన్న క్యాంటీన్లకు ఆ టెండర్లలో ఎల్-1గా హరేకృష్ణ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణను కూడా రూపొందించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ నెల 10నాటికి అన్నా క్యాంటీన్లు సిద్ధం చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి మరో 83 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది.
READ MORE:Anna Canteens: ముస్తాబవుతున్న అన్నా క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లల్లో హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆహర సరఫరా చేపట్టనుంది. 203 అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరా చేయనుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సరఫరా చేయనున్నారు. అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరాకు పిలిచిన టెండర్లలో ఎల్-1గా హరేకృష్ణ సంస్థ నిలిచింది. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. రోండో విడడతలో 83.. మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.
READ MORE: Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్.. ఫైనల్కు చేరిన వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు!
కాగా.. పేదల ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడంతో ధరలు ఎల ఉండబోతున్నాయనే చర్చకు సీఎం గతంలో సమాధానమిచ్చారు. సీఎంగా నాలుగో ఫైలుపై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు..ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు. గతంలోలాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదేసి రూపాయల చెప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. దీంతో రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!