Anna Canteens: ముస్తాబవుతున్న అన్న క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ
- ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్నా క్యాంటిన్లు ప్రారంభం
- రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న అందుబాటులోకి 100 అన్నా క్యాంటీన్లు
- ఈ నెల 10నాటికి సిద్ధం చేయాలని ఆదేశం
- రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లల్లో ఆహర సరఫరా చేపట్టనున్న హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్
- అన్న క్యాంటీన్లకు ఆ టెండర్లలో ఎల్-1గా హరేకృష్ణ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. గతంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు సమాచారం అందించారు. రాబోయే మూడు వారాల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేకంగా కార్యాచరణను కూడా రూపొందించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ నెల 10నాటికి అన్నా క్యాంటీన్లు సిద్ధం చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి మరో 83 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది.
READ MORE:Anna Canteens: ముస్తాబవుతున్న అన్నా క్యాంటిన్లు..ప్రారంభ తేదీ ప్రకటించిన పురపాలక శాఖ
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లల్లో హరేకృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆహర సరఫరా చేపట్టనుంది. 203 అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరా చేయనుంది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సరఫరా చేయనున్నారు. అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరాకు పిలిచిన టెండర్లలో ఎల్-1గా హరేకృష్ణ సంస్థ నిలిచింది. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. రోండో విడడతలో 83.. మూడో విడతలో 20 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్న మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది.
READ MORE: Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్లో భారత్కు షాక్.. ఫైనల్కు చేరిన వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు!
కాగా.. పేదల ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడంతో ధరలు ఎల ఉండబోతున్నాయనే చర్చకు సీఎం గతంలో సమాధానమిచ్చారు. సీఎంగా నాలుగో ఫైలుపై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు..ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా వెల్లడించారు. గతంలోలాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదేసి రూపాయల చెప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే భోజనం, టిఫిన్ లభించబోతున్నాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలే అవుతుంది. దీంతో రోజుకు 15 రూపాయలకే పేదల కడుపు నింపేందుకు సర్కార్ సిద్దం కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!