KTR: తెలంగాణ భవన్లో గ్రూప్-1 అభ్యర్థులతో ముగిసిన సమావేశం.. కేటీఆర్ కీలక నిర్ణయం
- పోరాటం మనేది బీఆర్ఎస్ కి కొత్త కాదన్న మాజీ మంత్రి
- గ్రూప్-1 అభ్యర్థుల కోసం పోరాటం
- బీఆర్ఎస్వీ కార్యాచరణపై మాట్లాడిన కేటీఆర్
- తెలంగాణ భవన్లో గ్రూప్-1 అభ్యర్థులతో ముగిసిన సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోరాటం మనేది బీఆర్ఎస్ కి కొత్త ఏం కాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ నిర్వహించిన బీఆర్ఎస్వీసమావేశంలోఆయన మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి, చంద్ర బాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం.. రేవంత్ రెడ్డి ఎంత? అన్నారు. నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరు తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి అని.. అలాంటి వ్యక్తీ మనకి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యమన్నారు. భారత దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎందరో విద్యార్థి అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చిన తెలంగాణ భవన్ హక్కున చేర్చుకుంటుందని.. వారికి అండగా ఉంటుందని చెప్పారు.
READ MORE: Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో… వైరల్
Also Read
జీవో 29 వల్ల గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అశోక్ నగర్ చుట్టు పోలీసుల ఉన్నారని తెలిపారు. గ్రూప్-1అభ్యర్థులే తెలంగాణ భవన్ కు వచ్చారని.. వారికి అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, రుణమాఫీ ఊసే లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఢిల్లికీ మూటలు తీసుకోని పోతున్నారని.. ఇప్పటి వరకు 25 సార్లు ఢిల్లీ పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని విమర్శించారు. తులం బంగారం ఏమైంది అన్నందుకు కేసులు పెడుతున్నారని.. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మూసి పేరుతో పేదల ఇండ్లు కూల్చుతుంటే బీజేపీ మౌనంగా ఉంటుందన్నారు.
READ MORE:Sheikh Hasina: షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ..
“డిసెంబర్ 3న బీఆర్ఎస్ ఒడిపోతుందని ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ప్రజలు బీఆర్ఎస్ ను ప్రతి పక్షంలో కూర్చోబెట్టారు. రాష్ట్రంలో బీజేపీ మరింత ప్రమాదకరమైన పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలతో బీఆర్ఎస్ పోరాడాలి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సదస్సు పెట్టుకోవాలి. కమిటీలు వేసుకోవాలి. నా కంటే అద్భుతంగా మాట్లాడే నాయకులు బీఆర్ఎస్వీలో ఉన్నారు. మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తుంది. ప్రభుత్వం పై బీఆర్ఎస్ పోరాడుతుంటే ఒక్క మీడియా చూపించడం లేదు. అందుకే సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉండాలి. రాష్ట్రంలో ప్రతి కాలేజీలో బీఆర్ఎస్వీ జెండా ఉండాలి. బ్యానర్ ఉండాలి. ఆ విధంగా విద్యార్థులు పోరాటం చెయ్యాలి. డి లిమిటేషన్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వారికి భవిష్యత్తు ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడి దాడులు జరిగినాయి ..ఎటువంటి సమాచారం బయటకు రాలే… బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలు అనడానికి ఇదే నిదర్శనం. మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లో గెలుస్తున్నాం ధీమానే మనల్ని కొంప ముంచింది… మేము అంతే ధీమాలో ఉండడంతో ఓడిపోయాము. చిన్న చిన్న పొరపాట్లు చేశాం,వాటిని సవరించుకుందాం, ప్రజలకు దగ్గర అవుదాం విద్యార్థి నాయకులదే భవిష్యత్. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ దో కాదు మన అందరిదీ. ఇంకో 50 నుంచి 75 యేండ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
- Tags
- BRS
- BRSV
- congress
- group 1 candidates
- ktr
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!