KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
- రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం
- కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన భేటీ
- హాజరైన కేటీఆర్, కమిటీ సభ్యులు
- రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చించారు. అంతేకాకుండా.. సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తదితర అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు ఎంసి కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ ఉన్నారు.
Read Also: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
సమావేశం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేయాలని 9 మందితో కమిటీ వేశామన్నారు. ఈ నెల 24 నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెట్టి నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో అధ్యయనం చేస్తారని తెలిపారు. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుసుకుంటారు.. ఫిబ్రవరి ఆఖరి వారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్కు ఈ నివేదిక ఇస్తారని చెప్పారు. మరోవైపు.. ఈ నెల 28న హైకోర్టు నల్గొండ దీక్షకు అనుమతి ఇచ్చింది.. న్యాయస్థానం చెప్పిన విధంగా శాంతి యుతంగా దీక్ష చేస్తామన్నారు. గ్రామ సభల్లో ప్రజలు అడిగిన దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియారిటీ ఫార్ములా ఈ కేసు.. తమ ప్రియారిటీ ఫార్మర్స్ అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల్లో భరోసా నింపేందుకు ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు.
Read Also: Minister Narayana: రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్.. హడ్కో కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
-
Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?