KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
- రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం
- కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన భేటీ
- హాజరైన కేటీఆర్, కమిటీ సభ్యులు
- రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చించారు. అంతేకాకుండా.. సంపూర్ణ రైతు రుణమాఫీ, యాసంగి పంటకు సాగునీరు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తదితర అంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ అధ్యయన కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు ఎంసి కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ ఉన్నారు.
Read Also: Viral Video: దెబ్బకు వైరల్ కావాలని.. పెదాలపై ఫెవిక్విక్ వేసుకున్న యువకుడు.. చివరికీ(వీడియో)
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
సమావేశం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు ఆత్మహత్యలపై అధ్యయనం చేయాలని 9 మందితో కమిటీ వేశామన్నారు. ఈ నెల 24 నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెట్టి నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో అధ్యయనం చేస్తారని తెలిపారు. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలుసుకుంటారు.. ఫిబ్రవరి ఆఖరి వారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్కు ఈ నివేదిక ఇస్తారని చెప్పారు. మరోవైపు.. ఈ నెల 28న హైకోర్టు నల్గొండ దీక్షకు అనుమతి ఇచ్చింది.. న్యాయస్థానం చెప్పిన విధంగా శాంతి యుతంగా దీక్ష చేస్తామన్నారు. గ్రామ సభల్లో ప్రజలు అడిగిన దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియారిటీ ఫార్ములా ఈ కేసు.. తమ ప్రియారిటీ ఫార్మర్స్ అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల్లో భరోసా నింపేందుకు ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు.
Read Also: Minister Narayana: రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్.. హడ్కో కీలక నిర్ణయం
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!