Mamata Banerjee: బంగ్లాదేశీయులకు ఆశ్రయం ఇస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్య..
- బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన
- మరవీరుల దినోత్సవ ర్యాలీలో మాట్లాడిన మమతా
- బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ
- బంగ్లాదేశీయుల కోసం పశ్చిమ బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు భారత సైన్యం బంగ్లాదేశీ చొరబాటు దారులను అడ్డుకునేందుకు కృషి చేస్తుంది. మరోపైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. శరనార్థులు బెంగాల్ తలపులు కొడితే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. శరణార్థులపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రస్తావిస్తూ..ఈ హామీ ఇచ్చారు.
READ MORE:Akhilesh Yadav: మోడీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, త్వరలో పడిపోతుంది..
Also Read
బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ప్రకటన చేశారు. ఆదివారం కోల్కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా విక్టోరియా హౌస్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బంగ్లాదేశీయుల కోసం పశ్చిమ బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
READ MORE: Ramappa Temple: ప్రమాద అంచుల్లో యునెస్కో గుర్తింపు ఉన్న రామప్ప దేవాలయం..
బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన విషయాలను మనం ప్రేరేపించకూడదని మమతా బెనర్జీ అన్నారు. బంగ్లాదేశీయులు మా తలుపు తడితే వారికి ఆశ్రయం ఇస్తామన్నారు. శరణార్థులపై ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రస్తావిస్తూ.. “హింసాత్మక బంగ్లాదేశ్లో బెంగాల్ నివాసితువుల బంధువులకు నేను పూర్తి మద్దతునిస్తాను. మీరు బెంగాల్ తలుపు తడితే, నేను మీకు సహాయం చేస్తాను.” అని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్లో ఉన్న మీ కుటుంబ సభ్యులకు.. చదువుకోవడానికి అక్కడికి వెళ్లిన వాళ్లకుచికిత్స కోసం వెళ్లి తిరిగి రాలేని వారికి సాయం అందిస్తానన్నారు.
READ MORE: VIRAAJI: ‘విరాజి’గా వచ్చేస్తున్న వరుణ్ సందేశ్.. ట్రైలర్ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల..
ఆమె మాట్లాడుతూ, “నేను బంగ్లాదేశ్ గురించి మాట్లాడలేను. ఎందుకంటే అది వేరే దేశం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. భారత ప్రభుత్వం చేతుల్లో ఉంది. కానీ నిస్సహాయ ప్రజలు బెంగాల్ తలుపు తడితే.. ఖచ్చితంగా వారికి ఆశ్రయం ఇస్తా. ఈ విషయానికి నేను కట్టుబడి ఉంటా.. ఎందుకంటే దీనిపై ఐక్యరాజ్యసమితి తీర్మానం ఉంది. ఎవరైనా శరణార్థులు ఉంటే.. పరిసర ప్రాంతం వారికి ఆశ్రయం కల్పిస్తుంది.” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!