Akhilesh Yadav: మోడీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, త్వరలో పడిపోతుంది..
- బీజేపీపై విరుచుకుపడిన అఖిలేష్ యాదవ్.. మమతా బెనర్జీ..
- ప్రభుత్వం త్వరలో పడిపోతుందని జోస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ రోజు ‘ ధర్మతల ర్యాలీ’ని నిర్వహించారు. కోల్కతాలో జరిగిన ఈ ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు కానీ, అంతిమంగా ఓడిపోతాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారని, కేంద్రంలోని ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే పడిపోతుందని జోక్యం చెప్పారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిడి నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్ అని ఆయన చెప్పారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
Read Also: Tummala Nageswara Rao: అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..
ఉత్తర్ ప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీలో మీరు ఆడిన ఆట బీజేపీ ప్రభుత్వాన్ని బలవంతంగా రాజీనామా చేయాల్సి ఉంది, కానీ సిగ్గులేని ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. 400 సీట్లు దాటుతామని చెప్పినప్పటికీ 240కే వారు పరిమితమయ్యారని బీజేపీని ఎద్దేవా చేశారు. టీఎంసీకి వ్యతిరేకంగా ఈడీ, సీబీఐని ప్రయోగించినా విజయం సాధించలేకపోయారని అన్నారు. సందేశ్ ఖాలీ నాటకంతో బెంగాల్ పరువు తీయాలని చూశారని మండిపడ్డారు.
#WATCH | West Bengal: At TMC's rally in Kolkata, Samajwadi Party chief Akhilesh Yadav says "…The people of Bengal have fought with the BJP and left them behind, the same happened in Uttar Pradesh…The people sitting in the Govt in Delhi are in power only for a few days. 'Woh… pic.twitter.com/BNQBcRblbW
— ANI (@ANI) July 21, 2024
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!