Congress: పర్యటన వల్ల బీజేపీ సీట్లు గెలవదు.. ప్రధాని టూర్ పై కాంగ్రెస్ విసుర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ కేరళ టూర్ పై కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించింది. లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ తరచూ కేరళలో పర్యటించడం వల్ల బీజేపీ అక్కడ ఖాతా తెరవబోదని కాంగ్రెస్ పేర్కొంది. కాగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి. భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మతం, ప్రార్థనా స్థలాలను రాజకీయాలతో కలపాలని చూస్తోందని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపించారు.
కేరళలోని లౌకిక మనస్తత్వం గల ప్రజలు విద్వేష ప్రచారాలను అంగీకరించరని, వాటిని తిరస్కరిస్తారని సతీశన్ అన్నారు. సమాజంలో విభజన సృష్టించడానికి ఎవరు ప్రయత్నించినా, కాంగ్రెస్ పార్టీ వారిని అలా అనుమతించదని తెలిపారు. ప్రధానమంత్రి కేరళను సందర్శించినంత మాత్రాన బీజేపీ కేరళలో ఒక్క సీటును గెలవదని ఆరోపించారు. కేరళ ప్రజల మనస్తత్వం మతతత్వానికి వ్యతిరేకంగా ఉందన్నారు. కేరళలో క్రైస్తవుల ఇళ్లకు కేక్లు తీసుకెళ్తున్నవారే ఇతర రాష్ట్రాల్లో చర్చిలను తగలబెట్టి, పూజారులను జైలుకు పంపారని ఆరోపించారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
IND vs AFG: అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్, రింకూ..
రాష్ట్ర ప్రజలు ఎంతో మేధావులని, అలాంటి వారు తమ ఇంటికి కేకులతో వస్తారంటే వారి అసలు రంగు అర్థమవుతోందన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రను దేశ ప్రజలు ఎంతో ఆశతో చూస్తున్నారని సతీశన్ అన్నారు. విద్వేష ప్రచారాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడమే ఈ యాత్ర ఉద్దేశమని ఆయన అన్నారు. లౌకికవాదాన్ని కాపాడేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు సతీశన్ తెలిపారు.
కాగా.. ఈ నెల మొదట్లో కేరళలో జరిగిన మహిళా సాధికారత కార్యక్రమానికి హాజరైన తర్వాత.. ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దక్షిణాది రాష్ట్రానికి అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు.
- Tags
- congress
- Kerala
- PM Modi
- telugu news
- tour
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!