Weather update: ఈ రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులపై కేంద్ర వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. కొన్ని రాష్ట్రాల్లో హీట్వేవ్ కొనసాగుతుందని.. మరికొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని.. దీంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్పింది.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందే..
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో హీట్వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేకంగా ఉత్తర కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ హీట్ ఉందని చెప్పారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా ఉందని పేర్కొన్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఈ రాష్ట్రాల్లో అక్కడకక్కడ ఉరుములతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని శుభవార్త చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడిగాలులు వీస్తాయని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Saripodhaa Sanivaaram: ఉగాది వేళ నాని ‘సరిపోదా శనివారం’ నుంచి కొత్త పోస్టర్!
ఇదిలా ఉంటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. అక్కడకక్కడ చిరు జల్లులు కూడా కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో ఎండ వేడిమి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. ఉక్కపోత నుంచి పిల్లలు, వృద్ధులు బయటపడ్డారు. రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం.. రాష్ట్రంలో ఎండ వేడిమి నుంచి కొన్ని రోజులు తప్పించుకునే పరిస్థితులు రావొచ్చు.
#WATCH | On weather predictions, Dr Naresh Kumar, senior scientist at IMD says, "If you talk about the last five-six days, there are heatwave conditions which were prevalent in South Peninsular India, specifically the areas were North Interior Karnataka, Tamil Nadu, Andhra… pic.twitter.com/pVrp0cZT2Q
— ANI (@ANI) April 9, 2024
తాజావార్తలు
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?