Unwanted Calls: స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం..!
- అవాంఛిత కాల్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు విడుదల
- కాల్స్ అనుమతించాలంటే వినియోగదారుడి అనుమతి తప్పనిసరి
- ఎలాంటి అనుమతి లేకుండా కాల్స్.. సందేశాలు వస్తే కంపెనీపై చర్యలు
- వీటిపై జూలై 21 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరనున్న ట్రై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన ఫోన్లో కాంటాక్ట్స్లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే.. ఎత్తాలా వద్దా అని వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం.. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటారు. వద్దనుకుంటుంటే అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. చాలా మందిని ఈ సమస్య వేధిస్తుంటుంది. రోజులో పదుల సంఖ్యలో ఇలాంటి కాల్స్ వస్తాయి. మనం అప్పుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు.. ఇలాంటి కాల్స్ వస్తే.. కోపం, చిరాకు వస్తాయి. ఇలాంటి కాల్స్ను నియంత్రించే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడట్లేదు. అందుకే ఇప్పుడు స్వయంగా కేంద్రం రంగంలోకి దిగింది. వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇలాంటి అవాంఛిత కాల్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం గురువారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
READ MORE: NET-NEET Paper Leak : నెట్-నీట్లో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్న కాంగ్రెస్
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా ప్రకారం.. ఎవరైనా వ్యాపార ప్రమోషన్ లేదా ఏదైనా అమ్మకానికి సంబంధించిన కాల్లను స్వీకరించడానికి వినియోగదారుడు పర్మిషన్ తప్పనిసరి చేసింది. వినియోగదారుని అనుమతి లేకుండా అతను అలాంటి కాల్లు మరియు సందేశాలను స్వీకరిస్తే అది అవాంఛిత వ్యాపారంగా పరిగణించబడుతుంది. కాలింగ్ ఎంటిటీ లేదా వ్యక్తి దీనికి బాధ్యత వహించాలి. నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి లేదా 10-అంకెల ప్రైవేట్ నంబర్ల నుంచి అవాంఛిత కాల్లను నిరోధించడం ప్రతిపాదిత మార్గదర్శకాల ఉద్దేశం. వస్తువులు, సేవలకు సంబంధించిన ఏదైనా ప్రచార కాల్ లేదా సేవా సందేశం వ్యాపార కమ్యూనికేషన్గా కిందికి వస్తుందని డ్రాఫ్ట్ పేర్కొంది. వ్యక్తి గత కమ్యూనికేషన్ దానికి దూరంగా ఉంచనుంది. ఆ కాల్స్ పై వినియోగదారుడి అంగీకారం తప్పనిసరి చేయనుంది. TRAI సూచనల తర్వాత కూడా అవాంఛిత కాల్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని, మంత్రిత్వ శాఖ, టెలికాం కంపెనీలతో సహా సంబంధిత అన్ని పార్టీలతో చర్చించింది. అనంతరం ఈ ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వీటిపై జూలై 21 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరనుంది.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?