PM Narendra Modi: “టెర్రరిజం” కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorism is vote bank for Congress, says pm narendra modi: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆదివారం గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిందని.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని పోరాడాలని కోరామని..కానీ వారు మాత్రం నన్ను లక్ష్యంగా చేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు.
గుజరాత్ రాష్ట్రం చాలా కాలంగా ఉగ్రవాదులకు లక్ష్యంగా ఉందని.. సూరత్, అహ్మదాబాద్ లలో జరిగిన పేలుళ్లలో చాలా మంది గుజరాత్ ప్రజలు చనిపోయారని.. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. మేము ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని అడిగితే..వారు మాత్రం నన్ను లక్ష్యంగా చేసుకున్నారని ప్రధాని కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో దేశంలో ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకుందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని.. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే అనేక ఇతర పార్టీలు కూడా పుట్టుకొస్తున్నాయని అన్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Read Also: US Layoffs: అర్థరాత్రి టెక్ట్స్ మెసేజ్.. 2700 మంది ఉద్యోగాలు ఉఫ్
బాట్లా హౌస్ ఎన్కౌంటర్ సమయంలో కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచారని.. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. 2014లో మీ ఒక్క ఓటు దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో సహకరించిందని.. మా సరిహద్దులపై దాడి చేసే ముందు ఉగ్రవాదులు చాలా ఆలోచించాలని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్ ని ప్రశ్నిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 25 ఏళ్ల వయసు ఉన్న యువత కర్ఫ్యూ ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదని.. బాంబు పేలుళ్ల నుంచి వారిని మేము రక్షించామని.. బీజేపీ డబుల్ ఇంజిన్ మాత్రమే ఇది చేయగలుగుతుందని ఆయన అన్నారు.
గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటించబడుతాయి. 2017 గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాల్లో బీజేపీ 99 స్థానాలను గెలుచుకుంది. గత 27 ఏళ్లుగా బీజేపీ గుజరాత్ లో అధికారంలో ఉంది. ఈ సారి 140 స్థానాలు దాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2001 నుంచి 2014 వరకు వరసగా నరేంద్రమోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!