Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం 8వేల మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారింది
- రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు.
- ప్రభుత్వ నిర్లక్ష్యం 8వేల మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిందంటూ వ్యాఖ్యలు.
- ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నట్లయితే వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విషయం సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. 30 ఏళ్లకుపైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ సింగ్ గారి పరిస్థితి చూస్తే హృదయం కలచివేస్తుందని ఆయన పేర్కొన్నారు. అతని రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రభుత్వ ఆరోగ్య భద్రత కార్డుతో ఆసుపత్రికి వెళ్లినా, ఆ కార్డు చెల్లుబాటు కావడం లేదని వైద్యసేవలు అందడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీస్ ఉద్యోగికి శాపంగా మారిందని ఆయన అన్నారు.
Also Read: iQOO Neo 10R:పవర్ ఫుల్ ఫీచర్స్ తో.. ఐకూ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ఇది ఒక్క నారాయణ సింగ్ గారి సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా 8000 మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవన్మరణ సమస్య అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీకు ఉద్యోగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నట్లయితే వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి. వీరికి వైద్య సేవలు అందేలా ఈహెచ్ఎస్ (EHS), పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులను ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై విమర్శలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!