Telangana SC Classification: ఎస్సీ వర్గీకరణ అమలు.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ..
- తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు..
- ప్రభుత్వం జీవో జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana SC Classification: తెలంగాణ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది. మూడు గ్రూపులుగా విభజన, రిజర్వేషన్ల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రూప్-A లో అత్యంత వెనుకబడిన కులాలకు 1 శాతం రిజర్వేషన్, గ్రూప్-B లో మధ్యస్థ లబ్దిదారులకు 9 శాతం రిజర్వేషన్, గ్రూప్- Cలో మెరుగైన స్థితిలో ఉన్న కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ విధంగా మొత్తం 15 శాతం రిజర్వేషన్లను వర్గీకరించిన రూపంలోనే కొనసాగించనున్నారు. ఈ వర్గీకరణ సామాజిక న్యాయానికి, సమతా స్థాపనకు దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి నేడు తీర్పు లభించింది. ఇది బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడంలో ముఖ్యమైన అడుగు” అని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో పేదలకు మెరుగైన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
అలాగే, ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజాహిత పథకాలపై ఆయన వివరించారు. యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేలు ఆర్థిక భరోసాగా అందిస్తున్నామని తెలిపారు. పేదల ఆత్మగౌరవ ప్రతీకగా “ఇందిరమ్మ ఇళ్లు” పథకాన్ని ప్రారంభించామని, భూమిపై హక్కుల కోసం “భూభారతి” పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ నిర్ణయాలు తెలంగాణలోని ఎస్సీ వర్గాలకు సామాజిక, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రగతిపథంలో ముందడుగు వేయడం అని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!