Puvvada Ajay Kumar: మీ పాలనలో వాటర్ ట్యాంకర్లు తిరిగితే.. మా పాలనలో ఇంట్లో టాప్లు తిప్పుతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
khammam BRS Candidate Puvvada Ajay Kumar Slams Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి. ఎన్నికల పోలింగ్కు ఇంకా 30 రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుపై సెటైర్స్ పేల్చారు. కాంగ్రెస్ పాలనలో వాటర్ ట్యాంకర్లు తిరిగితే.. తమ పాలనలో ఇంట్లో మహిళలు టాప్లు తిప్పుతున్నారన్నారు. ఖమ్మం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజయ్కు తుమ్మల సవాల్ విసిరిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ… ’76 ఏళ్ల పాలనలో ఖమ్మం నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదు. ఇదికాదు ఒక్క కళాశాల అయినా తెచ్చారా. ఇపుడు పోటీ చేసే అభ్యర్థి ఎందుకు అభివృద్ధి చేయలేదు. నేను ఇక్కడి భూమిపుత్రుడను. ఖమ్మం అభివృద్ధికి సాయపడుతున్నా. మీ పాలనలో వాటర్ ట్యాంకర్లు తిరిగాయి.. మా పాలనలో ఇంట్లో మా అక్కలు టాప్లు తిప్పుతున్నారు. ఖమ్మంను నలువైపులా అభివృద్ధి చేసాం. కొత్తగా ఏర్పడ్డ రఘునాథపాలెంను 253 కోట్లతో అభివృద్ధి చేశాం. ఖమ్మం రూపురేఖలు పూర్తిగా మార్చాం’ అని అన్నారు.
Also Read
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
- Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
‘ఖమ్మంలో 2014లో 70 అపార్ట్మెంట్స్ ఉండేవి. ఇపుడు 800 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నీ శిలాఫలకాలకు నేను ఫలితాలు చెప్పించా. ప్రజలకు కావాల్సింది శిలాఫలకాలు కాదు..పూర్తి అయిన పనులు కావాలి. నువు పాలేరుకు ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాష్ట్రానికి మంత్రివి కదా.. అపుడేందుకు బ్రిడ్జిలు కట్టలేదు. తీగల వంతెన కట్టాలని పాలేరు ప్రజలు అడిగితే అవసరమా? అన్నావు. తీగల వంతెన కడితే ఖమ్మం ఎమ్మెల్యేకు క్రెడిట్ వస్తుందని అభివృద్ధి చేయలేదు. మీ పిచ్చి రాజకీయాలకు, సోషల్ మీడియా మాటలకు ప్రజలు మొగ్గరు’ అని పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!