Vijayashanti : బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది
- బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది
- అయినా సీఎం రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు
- కాంగ్రెస్కు ఎక్కువ పనిచేసింది నేనే
- 2023లో నాకు ఎమ్మెల్సీ ఇస్తామని హైకమాండ్ చెప్పింది
- చెప్పినట్లే ఇచ్చింది. నేను అడగలేదు : విజయశాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanti : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ జాబితాలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, , విజయశాంతి పేర్లు ఖరారు చేయబడ్డాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని తీసుకుని, అధికారికంగా టికెట్లు అందజేసింది.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించబడిన తర్వాత, ఈ విషయంపై విజయశాంతి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి తనకు కేటాయించారా లేదా అనే అంశం తనకు తెలియదని, కాంగ్రెస్ అధిష్ఠానం ఏ ఆలోచనలో ఉందో తనకు స్పష్టంగా తెలియదని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా తనకు కొత్త బాధ్యతలు అప్పగించబడ్డాయని, వాటిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పనిచేసిన వ్యక్తిగా, ఎమ్మెల్సీగా అవకాశం దక్కడం తనకు గర్వకారణమని విజయశాంతి అన్నారు. ఈ బాధ్యతను తనకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యంగా సోనియా గాంధీకి, కాంగ్రెస్ హై కమాండ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. “ఈ రోజు నా కొత్త ప్రయాణంలో మొదటి రోజు. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో చూద్దాం,” అని ఆమె వ్యాఖ్యానించారు.
Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ డిస్మిస్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విజయశాంతి, ఆయన హయాంలో రాష్ట్ర ఖజానా పూర్తిగా ఖాళీ అయినట్లు ఆరోపించారు. “తెలంగాణ ఖజానాను కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారు. రాష్ట్రం ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది,” అని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఈ అంశాన్ని తాను గతంలో ఎన్నోసార్లు ప్రస్తావించానని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను మోసగించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నా, వారి ఆటలు ఇక చెల్లవని స్పష్టం చేశారు.
తాను ఎప్పుడూ రాజకీయ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీని అడగలేదని, తనకు ఏ బాధ్యత కేటాయించినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ తనను ఎమ్మెల్సీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్లో చేరినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, తమ పాలనలో మహిళలు, యువత, రైతులు , అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన భవిష్యత్తు సిద్ధమవుతుందని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.
Rain Alert: ఈ రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!