Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Budget Loans Revanth Reddy Slams Kcr

CM Revanth Reddy : రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు.. ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీనే కడుతున్నాం

Published Date :February 24, 2025 , 4:05 pm
By Gogikar Sai Krishna
  • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి
  • ఉద్యోగ నియామకాల విషయంలో బీఆర్ఎస్ వైఫల్యం
  • కులగణన – తెలంగాణ ప్రభుత్వం సాహసం : సీఎం రేవంత్‌
CM Revanth Reddy : రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు..  ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీనే కడుతున్నాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో వివరించారు. ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్పుల వల్ల రాష్ట్రం ప్రతినెలా రూ.6500 కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.

కేసీఆర్ పదేళ్ల పాలనలో ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి తేదీన వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఆయన పాలనలో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ల హామీలు ఇచ్చినా, అధికారంలో ఉన్నప్పుడు వాటిని అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Gyanesh Kumar: కుంభమేళలో పాల్గొన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్.. కుటుంబ సభ్యులతో కలిసి స్నానం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఏడాది వ్యవధిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఇందులో 11,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కూడా చేపట్టామని వెల్లడించారు. అంతేకాదు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో సేవా నిధులు అందించలేని స్థితికి రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం నెట్టివేసిందని విమర్శించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు ఉండగా, తమ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను నిర్లక్ష్యం చేసిందని, దీని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని, పదోన్నతులు, బదిలీలను అమలు చేసినట్లు వివరించారు.

రాహుల్ గాంధీ ఆశయాల మేరకు తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎవరూ చేయలేని సాహసం చేసి, కులగణనను చేపట్టిందని ప్రకటించారు. వందేళ్లుగా జరగని కులగణనను సమర్థవంతంగా నిర్వహించి, సామాజిక న్యాయం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణనను మరింత విస్తృతంగా అమలు చేస్తామని అన్నారు.

కేసీఆర్‌పై తన విమర్శలను మరింత తీవ్రతరం చేసిన రేవంత్ రెడ్డి, ప్రజలు ఆయనను తిరస్కరించినప్పటికీ ఆయనలో మార్పు రాలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినా, ప్రజల తీర్పును గౌరవించకుండా కేసీఆర్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రజా సేవను విడిచిపెట్టి ఫామ్ హౌస్‌ రాజకీయాల్లో మునిగిపోయారని, తెలంగాణ ప్రజలకు అతనిలో ఇక నమ్మకం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పేగు బంధం తెంచుకొని పార్టీ పేరు కూడా మార్చుకోవడం రాజకీయ దివాళా తీయడమేనని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, ప్రజలు వాటిని గమనించి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.

IND vs PAK: పని చేయని పాకిస్తాన్ కెప్టెన్ ట్రిక్.. మంత్రాలు చేసినప్పటికీ ఓటమి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS Government
  • Congress Telangana
  • kcr
  • KCR Criticism
  • revanth reddy

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions