Uttam Kumar Reddy : దళిత స్పీకర్ను అవమానపరిచేట్లు మాట్లాడడం సరికాదు
- జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న
- చైర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు
- స్థాయిని తగ్గించి వ్యంగ్యంగా మాట్లాడి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను అవమాన పరిచారు : మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గురువారం అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్, ప్రజాస్వామ్యంలో స్పీకర్ పదవికి ప్రత్యేకమైన గౌరవం, అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. “ఒక సభ్యుడు స్పీకర్పై ఇంత అహంకారంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. దీన్ని సాధారణంగా తీసుకోవడం తగదు,” అని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, జగదీష్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
CM Chandrababu: విద్యుత్తు రంగంలో ఎన్నో సంస్కరణలు టీడీపీ తెచ్చింది..
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
అంతకుముందు సభలో మాట్లాడిన జగదీష్ రెడ్డి, “మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డవారమే. మీరూ మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు. ఈ సభ మీ సొంతమేం కాదు,” అంటూ స్పీకర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ, “స్పీకర్ను బెదిరించడం, ఆయన పదవిని అపహాస్యం చేయడం సరైనది కాదు. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణ చెప్పాలి,” అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వివాదం అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులను తీసుకువచ్చింది, స్పీకర్ గౌరవాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
IPL 2025: అయ్యర్ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడానికి కారణం అదే: వెంకీ
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!