IPL 2025: అయ్యర్ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడానికి కారణం అదే: వెంకీ
- మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2025 ఆరంభం
- కేకేఆర్ కెప్టెన్గా అజింక్య రహానే
- కోల్కతా వైస్ కెప్టెన్గా వెంకటేశ్ అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 సీజన్కు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్గా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ప్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ నియమించారు. డాషింగ్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. 23.75 కోట్లు పెట్టి కొనుకున్న అయ్యర్ను సారథిగా ఎంపికవుతాడని ముందు నుంచి అందరూ అనుకున్నారు. అయితే సీఈవో వెంకీ అనూహ్యంగా రహానేను కెప్టెన్గా నియమించారు. భారీ మొత్తం వెచ్చించి కొనుకున్న అయ్యర్ను కెప్టెన్గా ఎంపిక చేయకపోవడంపై సీఈవో వెంకీ మైసూర్ వివరణ ఇచ్చారు. అయ్యర్ ఇంకా పరిణితి సాధించాల్సి ఉందని, అత్యున్నత బాధ్యతలు చేపట్టేందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు.
కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ… ‘ఐపీఎల్ చాలా ఒత్తిడితో కూడిన టోర్నమెంట్. కెప్టెన్సీ కోసం మేము వెంకటేష్ అయ్యర్ గురించి చర్చించాం. అయితే కెప్టెన్సీ కారణంగా యువకుడైన అతడిపై భారం పడుతుందని భావించాం. టోర్నీ ముందుకు సాగుతున్న కొద్దీ సవాళ్లు ఎదురవుతాయి. స్థిరత్వం, పరిణతి, అనుభవం ఉన్న ఆటగాడు అవసరం. ఈ లక్షణాలు అజింక్య రహానేలో ఉన్నాయి’ అని చెప్పారు. వెంకటేష్ అయ్యర్ తదుపరి కేకేఆర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రహానే కెప్టెన్సీలో అయ్యర్ అన్ని విషయాలు నేర్చుకుంటాడు.
Also Read
- Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
- PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
Also Read: Rohit Sharma: ఐపీఎల్ 2025 తర్వాతే రోహిత్ శర్మ నిర్ణయం!
ఐపీఎల్ 2024 అనంతరం వెంకటేష్ అయ్యర్ను కేకేఆర్ విడుదల చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని తిరిగి రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు వేలంలో అజింక్య రహానే పేరు మొదట వచ్చినప్పుడు కేకేఆర్ తీసుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్లు మరోసారి వేలంలోకి రాగా.. రహానేను బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 36 ఏళ్ల రహానే 2008 నుండి వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు 185 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. భారత జట్టుకు కూడా సారథ్యం వహించిన అనుభవం అతడికి ఉంది. ఐపీఎల్ 2024లో టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును వీడిన విషయం తెలిసిందే. మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2025 ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
-
PoK: పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్..
-
Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
-
CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. కాటేరమ్మ కొడుకు రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!