Team India: శ్రీలంక చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో
- మూడు టీ20ల అంతర్జాతీయ సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న టీమిండియా
- జూలై 22న శ్రీలంకకు చేరుకున్న భారత జట్టు
- ఈరోజు నుంచి ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించిన టీమిండియా
- టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కి ఇది మొదటి అసైన్మెంట్
- టీ20 కెప్టెన్గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్కు మొదటి టూర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు టీ20ల అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూలై 22న శ్రీలంకకు చేరుకుంది. ఈ క్రమంలో.. ఈరోజు నుంచి భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కి ఇది మొదటి అసైన్మెంట్. అలాగే.. టీ20 కెప్టెన్గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్కు కూడా ఇది మొదటి టూర్. టీమ్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.. అనంతరం.. రవీంద్ర జడేజాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా.. టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే శ్రీలంక పర్యటనకు భారత జట్టును ప్రకటించగానే.. కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్కు అప్పగించారు. వాస్తవానికి. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అందువల్ల సూర్యనే కెప్టెన్సీకి ఉత్తమ ఎంపికగా భావించారు.
Read Also: Italy: మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం.. ఎయిర్పోర్టు మూసివేత
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచ కప్ తర్వాత, టీమిండియా ఐదు మ్యాచ్ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లింది. ఆ పర్యటనలో జట్టులోని చాలా మంది సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేలో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. భారత్ వర్సెస్ శ్రీలంక టీ20 ఇంటర్నేషనల్ సిరీస్.. జూలై 27 నుండి జూలై 30 వరకు పల్లెకెలెలో జరగనుంది. ఈ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లు జూలై 27, 28 తేదీల్లో జరగనుండగా.. చివరి మ్యాచ్ జూలై 30న జరగనుంది. ఆ తర్వాత భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా జరగనుంది.
𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 𝗚𝗮𝘂𝘁𝗮𝗺 𝗚𝗮𝗺𝗯𝗵𝗶𝗿 𝗧𝗮𝗸𝗲𝘀 𝗖𝗵𝗮𝗿𝗴𝗲! 💪#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc
— BCCI (@BCCI) July 23, 2024
- Tags
- practice
- Sri Lanka
- Team India
- Video
తాజావార్తలు
-
PEDDI Ki Aawaz: నమస్తే భోపాల్.. దసరా మైదాన్లో ‘పెద్ది’ దిగుతున్నాడు!
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!