CM Revanth Reddy : రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల సందడి
- ప్రధాన పార్టీల ప్రచారం ఉధృతం
- రేపు ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈ నెల 25తో ముగియనుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తదితర ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సహా ఆయా జిల్లాల మంత్రులు, ఇంఛార్జి మంత్రులు రంగంలోకి దిగారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చుతున్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం గమనార్హం. కాంగ్రెస్ ఒకే గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పోటీ చేస్తుండగా, బీజేపీ మాత్రం మూడు స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. దీంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత వారం రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి అన్ని జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, అరవింద్ తదితరులు కూడా వివిధ ప్రాంతాల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య దేశం పాకిస్థాన్ ఔట్..
ప్రస్తుతం మూడు స్థానాల్లోనూ బీజేపీకి విజయం లేనప్పటికీ, ఈసారి గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ వ్యవహారాల ఇంఛార్జి సునీల్ బన్సల్ సీనియర్ నేతలతో సమీక్షలు నిర్వహించి, ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. అనుబంధ విభాగాలను కూడా రంగంలోకి దింపి ప్రచారం ముమ్మరం చేశారు.
కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కొండా సురేఖలను ప్రచారానికి వినియోగిస్తోంది. పీసీసీ ఆధ్వర్యంలో భారీ సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఇక టీచర్ సంఘాలు తమ అభ్యర్థుల గెలుపు కోసం చివరి క్షణాల్లో ప్రచారం ముమ్మరం చేశాయి. మంగళవారమే ప్రచారానికి తుది గడువు కావడంతో, సెలవులు పెట్టి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని చేపట్టారు. తమ అభ్యర్థుల గెలుపు వల్ల వచ్చే ప్రయోజనాలను ఓటర్లకు వివరిస్తూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే, మద్దతు ఉన్నా ఓటింగ్ రోజున ఆ మద్దతు ఓటుగా మారుతుందా? అనే అనుమానం అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోంది.
Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన పడవద్దు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!