Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tummala Nageswara Rao Clarifies Urea Availability In Telangana

Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన పడవద్దు

Published Date :February 23, 2025 , 8:56 pm
By Gogikar Sai Krishna
  • వ్యవసాయాధికారులతో మంత్రి తుమ్మల టెలికాన్ఫరెన్స్
  • రాష్ట్రంలో యూరియా కొరత లేదు
  • రైతులు ఆందోళన పడవద్దు : మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన  పడవద్దు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tummala Nageswara Rao : రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికి 2.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వము నుండి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిఉండగా, రాష్ట్రానికి 6.81 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని, కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరిస్తున్నా, రాష్ట్రానికి కేటాయించిన దానిలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మార్క్ ఫెడ్ వద్ద ఉంచిన 3.08 లక్షల మెట్రిక్ టన్నులతో అవసరం మేరకు అన్ని జిల్లాలకు సరఫరా చేస్తూ ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటికే మా అధికారులు కేంద్ర అధికారులను కలవడం జరిగిందని, తాను ప్రత్యక్షంగా సంబంధిత మంత్రివర్యులకు లేఖల ద్వారా మా రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేయాల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు.

Also Read

  • Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
  • Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

SLBC : ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. రంగంలోకి నేవీ ప్రత్యేక బృందం

రాష్ట్రానికి సంబంధించిన బిజెపి పెద్దలు కూడా ఈ విషయంలో విమర్శలు మాని మన రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తమ వంతు కృషి చేస్తే బాగుంటుందని, పెరిగిన విస్తీర్ణం , వినియోగం దృష్ట్యా రైతుల శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని తమ వంతు బాధ్యత తీస్కొని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు మద్ధతు అందిస్తే మంచిదని హితవు పలికారు.. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి కేటాయించిన యూరియా వెంటనే సరఫరా చెయ్యాలని కోరడం జరిగిందన్నారు.

గత యాసంగిలో సాగైన పంటల విస్తీర్ణంతో పోల్చుకుంటే, ఈ సారి నీటి వనరులు, భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటం తో ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల విస్తీర్ణంలో 5 నుండి 10 శాతం వరకు వృద్ధి నమోదైనట్టు, యూరియా వాడకం కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పటికే 1.9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా వినియోగించినట్టు మంత్రిగారు తెలిపారు.

ఐనప్పటికి రాష్ట్ర ప్రభుత్వము పంటకాలం ప్రారంభం నుండే నిత్యం సమీక్షించుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సరిపడ యూరియా నిల్వలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకున్నామని, వెస్సెల్స్ కానీ, రైల్వే wagons కానీ రావడంలో ఎక్కడైనా, ఏదైనా జిల్లాకు ఆలస్యమైతే వెంటనే పొరుగుజిల్లాల నుండి తరలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.29 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఫిబ్రవరి 22న 3 rakes, 23న 7 , 24న 4 , 25న 7 , 26న 4 , 27న 5 rakes, 28న 4 rakes మొత్తం 81,800 మెట్రిక్ టన్నులు ఈ వారంలో సరఫరా అవుతుందని తెలియజేశారు. అధికారులు యూరియా సరఫరా విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, కృత్రిమంగా ఎవరైనా కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను మంత్రిగారు ఆదేశించడం జరిగింది.

IND vs PAK: ఓడీఐలో అత్యధిక క్యాచ్‌లు.. సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ ‘కోహ్లీ’

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central government
  • farmers news
  • fertilizer shortage
  • telangana agriculture
  • telangana government

తాజావార్తలు

  • Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

  • Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్

  • Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..

  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక

  • IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions