TDP MPs on Union Budget: బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు ఉపశమనం.. పెండింగ్ సమస్యలకు పరిష్కారం
- కేంద్ర బడ్జెట్పై స్పందించిన టీడీపీ ఎంపీలు
- బడ్జెట్లో ఏపీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారని వెల్లడి
- కేంద్రం సాయం అందించకపోతే ఏపీ ఎంతో నష్టపోయేదన్న ఎంపీలు
TDP MPs on Union Budget: టీడీపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్పై స్పందించారు. బడ్జెట్లో ఏపీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టారన్నారు. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునేలా చేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో 20 ఏళ్లు వెనక్కి పోయిందని.. కేంద్రం సాయం అందించకపోతే ఏపీ ఎంతో నష్టపోయేదన్నారు. ఎన్నికల ముందే ప్రజలకు హామీ ఇచ్చామని, కేంద్రంలో మోడీ, ఏపీలో మోడీ వస్తే అభివృద్ధి సాధ్యం అని చెప్పామన్నారు. అమరావతికి 15 వేల కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అమరావతి అభివృద్ధి జరక్కుండా జగన్ అడ్డుకున్నారని ఆరోపించారు. పోలవరం జీవనాడి ప్రాజెక్టు అని.. జగన్ పోలవరాన్ని వెనక్కి తీసుకు పోయారని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ స్పష్టం చేశారు.
Read Also: P. Chidambaram: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మలా చదివింది..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
దేశ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ద్వారా నెరవేర్చే ప్రయత్నం జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ దిగుబడి పెంచడంపై దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. సంక్షేమం కావాలి తప్పదు.. దాంతో పాటు ఉపాధి కల్పన కూడా కావాలన్నారు. ఉపాధి కల్పన కోసం బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత ఐదేళ్లలో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల ఫలితంగా ఇది సాధ్యపడిందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడం సాధ్యపడిందని.. పోలవరం ప్రాజెక్టు పెరిగిన అంచనా వ్యయం ఇవ్వమని అడుగుతున్నామని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు. ఏపీకి పరిశ్రమలు రావాలని చెప్పగా.. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్ ఇచ్చారని.. ఇది చాలా ఉపయోగకరమన్నారు. పూర్వోదయ స్కీమ్ ద్వారా తూర్పు భారత రాష్ట్రాల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా తోడ్పాటు అందనుందని ఎంపీ వెల్లడించారు. ఇందులో అన్ని రంగాల ప్రాజెక్టులు ఉంటాయని ఆయన చెప్పారు.
బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు కొంత ఉపశమనం దొరికిందన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న దిశగా ఈ బడ్జెట్ ఒక మొదటి అడుగు అని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉందని.. హైదరాబాద్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తోందన్నారు. అలాంటి నగరం ఏపీకి లేదని.. అమరావతిని గత ప్రభుత్వం ఆపేసిందన్నారు. అమరావతి వల్ల రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా లాభం అని సీఎం చెప్పారన్నారు. వెనుకబాటుతనం తక్కువగా ఉన్న రాష్ట్రాలు నరేగా నిధులు ఎక్కువ తీసుకెళ్లారని.. ఏపీ గత ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!