Kakarla Suresh: తండ్రి కోసం కొడుకు, కూతురు ఎన్నికల ప్రచారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పల్లె జనం వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ కొడుకు, కుమార్తె మాట్లాడుతూ.. పుణ్యభూమి మీద ప్రేమతో విలాసవంతమైన జీవితాన్ని వదిలి, మీ సేవకై వచ్చిన కాకర్ల సురేష్ ని ఆశీర్వదించాలని కోరారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు.
Read Also: Dil Raju: Deverakonda: మొన్న అన్నారు.. ఇప్పుడు చేసి చూపించారు
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
ఇక, సీతారాంపురం మండలం పబ్బులేటి పల్లి పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన యువత ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేస్ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానన్నారు. అదే విధంగా ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు.
Read Also: Loksabha Elections : సూరత్, ఇండోర్, ఇప్పుడు పూరీ.. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన కాంగ్రెస్ అభ్యర్థి
మరో వైపు ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం విరువూరు పంచాయతీలో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ఇంటింటా తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికలలో తన భర్త ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే, వింజమూరు మండల హెడ్క్వటర్ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన సుమారు 10 కుటుంబాలు కాకర్ల సురేష్ తమ్ముడు కాకర్ల సునీల్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, కలిగిరి మండలం క్రాకుటూరు పంచాయతీలో కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!