Kakarla Suresh: తండ్రి కోసం కొడుకు, కూతురు ఎన్నికల ప్రచారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా నాన్న కాకర్ల సురేష్ ని గెలిపించాలని ఆయన కొడుకు సంహిత్, కూతురు ధాత్రి ఉదయగిరిలోని గొల్లపాలెం, ఎస్సీ, ఎస్టీ పూసల కాలనీలలో తండ్రితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పల్లె జనం వారికి కర్పూర హారతులు ఇచ్చి పూలను వేదజల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ కొడుకు, కుమార్తె మాట్లాడుతూ.. పుణ్యభూమి మీద ప్రేమతో విలాసవంతమైన జీవితాన్ని వదిలి, మీ సేవకై వచ్చిన కాకర్ల సురేష్ ని ఆశీర్వదించాలని కోరారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు అభ్యర్థించారు.
Read Also: Dil Raju: Deverakonda: మొన్న అన్నారు.. ఇప్పుడు చేసి చూపించారు
Also Read
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
ఇక, సీతారాంపురం మండలం పబ్బులేటి పల్లి పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన యువత ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కాకర్ల సురేష్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేస్ మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానన్నారు. అదే విధంగా ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు.
Read Also: Loksabha Elections : సూరత్, ఇండోర్, ఇప్పుడు పూరీ.. ఎన్నికల్లో పోటీకి నిరాకరించిన కాంగ్రెస్ అభ్యర్థి
మరో వైపు ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం విరువూరు పంచాయతీలో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ఇంటింటా తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికలలో తన భర్త ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే, వింజమూరు మండల హెడ్క్వటర్ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన సుమారు 10 కుటుంబాలు కాకర్ల సురేష్ తమ్ముడు కాకర్ల సునీల్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, కలిగిరి మండలం క్రాకుటూరు పంచాయతీలో కాకర్ల సురేష్ తల్లి కాకర్ల మస్తానమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరిగి కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తాజావార్తలు
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!