Tammineni Veerabhadram : ప్రత్యామ్నాయం, పునరావాసం తర్వాతనే ఇండ్లు కూల్చాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలాంటి ప్రత్యామ్నాయం, పునరావాసం కల్పించకుండానే హైదరాబాదు మూసీ నది పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇండ్లు, గుడిసెలను హైడ్రా అధికారులు వెంటనే తొలగించేందుకు పూనుకోవడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా పునరావాసం కల్పించిన తర్వాతనే ఇండ్లను కూల్చే పనిని చేపట్టాలని, మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాదులోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్నగర్ తదితర ప్రాంతాల్లో ఎఫ్టిఎల్ జోన్లో దశాబ్దాలుగా వున్న 2వేలకు పైగా పేదల ఇండ్లు కూల్చడానికి హైడ్రా ప్రస్తుతం సర్వే చేసి మార్కింగ్ చేస్తున్నదన్నారు.
Puja Khedkar: ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం.. అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ పేదలంతా కూలీ పని, చిన్నచిన్న షాపుల్లో ఇతర పనులు చేసుకుంటున్న పేద బలహీనవర్గాలకు చెందిన కుటుంబాలే ఎక్కువగా వున్నాయన్నారు తమ్మినేని వీరభద్రం. పేదరికం, ఆర్ధిక ఇబ్బందుల వల్ల గుడిసెలు వేసుకున్న వారు కొందరైతే, స్థలాలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్లు చేసుకుని, ఇంటి నిర్మాణానికి మున్సిపల్ పర్మిషన్ తీసుకుని ఇండ్లు కట్టుకున్నవారు కొందరున్నారని ఆయన అన్నారు. అందువల్ల వీరు నివాసం వుంటున్న సమీప ప్రాంతాల్లో ఇండ్లను కేటాయించాల్సిన అవసరం వున్నది. ప్రభుత్వం వీరికి హైదరాబాదు నగర శివార్లలో డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వడం వల్ల రోజువారీ పనిచేసుకుంటున్న పేదలు వెళ్లడం ఆచరణలో సాధ్యం కాదు. కావున ప్రత్యామ్నాయం కల్పించకుండా ఇండ్ల తొలగింపునకు పూనుకోరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నదని ఆయన అన్నారు.
Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!