Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
- గోద్రా రైలు దహనం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
- జనవరి 15న దాఖలైన పిటిషన్లపై విచారణ..
- 2002లో గుజరాత్ అల్లర్లకు కారణమైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ ప్రభుత్వంతో పాటు పలువురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వాయిదాలు వేయబోమని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, రాజేష్ జిందాల్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 27, 2002న గుజరాత్లోని గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్లోని S-6 కోచ్ని కాల్చివేయడంతో 59 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రంలో మత కలహాలకు కారణమైంది. ఇరు వర్గాలకు చెందినవారు మరణించారు. అనేక మంది దోషుల శిక్షను సమర్థిస్తూ, 11 మంది మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ గుజరాత్ హైకోర్టు అక్టోబర్ 2017లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ కేసులో హైకోర్టు జీవిత ఖైదు విధించబడిన 11 మంది దోషులకు మరణశిక్ష విధించాలని కోతురూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరింది.
Also Read
- Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
Read Also: Flipkart and Amazon Sale: అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు..
అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను గురువారం విచారణకు తీసుకుంది. మరణశిక్షకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్ ముందు వాదించాల్సి ఉన్నందున ఈ విషయాన్ని మరో రోజు విచారణకు వాయిదా వేయాలని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది స్వాతి గిల్దియాన్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరుఫు న్యాయవాది స్వాతి గిల్డియాల్ అభ్యర్థన మేరకు జనవరి 15, 2025న ఈ కేసుని జాబితా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో 11 మంది దోషులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. మరో 20 మందికి జీవతఖైదు విధించింది. ఈ కేసులో మొత్తం 31 మంది దోషుల శిక్షల్ని హైకోర్టు సమర్థించింది. మరణశిక్ష పడిన దోషుల శిక్షను జీవితఖైదుగా మార్చింది.
తాజావార్తలు
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!