Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
- గోద్రా రైలు దహనం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
- జనవరి 15న దాఖలైన పిటిషన్లపై విచారణ..
- 2002లో గుజరాత్ అల్లర్లకు కారణమైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ ప్రభుత్వంతో పాటు పలువురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వాయిదాలు వేయబోమని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, రాజేష్ జిందాల్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 27, 2002న గుజరాత్లోని గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్లోని S-6 కోచ్ని కాల్చివేయడంతో 59 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రంలో మత కలహాలకు కారణమైంది. ఇరు వర్గాలకు చెందినవారు మరణించారు. అనేక మంది దోషుల శిక్షను సమర్థిస్తూ, 11 మంది మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ గుజరాత్ హైకోర్టు అక్టోబర్ 2017లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ కేసులో హైకోర్టు జీవిత ఖైదు విధించబడిన 11 మంది దోషులకు మరణశిక్ష విధించాలని కోతురూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరింది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Flipkart and Amazon Sale: అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు..
అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను గురువారం విచారణకు తీసుకుంది. మరణశిక్షకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్ ముందు వాదించాల్సి ఉన్నందున ఈ విషయాన్ని మరో రోజు విచారణకు వాయిదా వేయాలని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది స్వాతి గిల్దియాన్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరుఫు న్యాయవాది స్వాతి గిల్డియాల్ అభ్యర్థన మేరకు జనవరి 15, 2025న ఈ కేసుని జాబితా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో 11 మంది దోషులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. మరో 20 మందికి జీవతఖైదు విధించింది. ఈ కేసులో మొత్తం 31 మంది దోషుల శిక్షల్ని హైకోర్టు సమర్థించింది. మరణశిక్ష పడిన దోషుల శిక్షను జీవితఖైదుగా మార్చింది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!