Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
- గోద్రా రైలు దహనం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
- జనవరి 15న దాఖలైన పిటిషన్లపై విచారణ..
- 2002లో గుజరాత్ అల్లర్లకు కారణమైన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్ ప్రభుత్వంతో పాటు పలువురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను జనవరి 15న విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వాయిదాలు వేయబోమని న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, రాజేష్ జిందాల్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 27, 2002న గుజరాత్లోని గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్లోని S-6 కోచ్ని కాల్చివేయడంతో 59 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రంలో మత కలహాలకు కారణమైంది. ఇరు వర్గాలకు చెందినవారు మరణించారు. అనేక మంది దోషుల శిక్షను సమర్థిస్తూ, 11 మంది మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ గుజరాత్ హైకోర్టు అక్టోబర్ 2017లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ కేసులో హైకోర్టు జీవిత ఖైదు విధించబడిన 11 మంది దోషులకు మరణశిక్ష విధించాలని కోతురూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరింది.
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
Read Also: Flipkart and Amazon Sale: అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు..
అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను గురువారం విచారణకు తీసుకుంది. మరణశిక్షకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టులోని మరో బెంచ్ ముందు వాదించాల్సి ఉన్నందున ఈ విషయాన్ని మరో రోజు విచారణకు వాయిదా వేయాలని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది స్వాతి గిల్దియాన్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరుఫు న్యాయవాది స్వాతి గిల్డియాల్ అభ్యర్థన మేరకు జనవరి 15, 2025న ఈ కేసుని జాబితా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో 11 మంది దోషులకు ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. మరో 20 మందికి జీవతఖైదు విధించింది. ఈ కేసులో మొత్తం 31 మంది దోషుల శిక్షల్ని హైకోర్టు సమర్థించింది. మరణశిక్ష పడిన దోషుల శిక్షను జీవితఖైదుగా మార్చింది.
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..