Rhea Chakraborty: బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ఊరట!
- సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు
- నటి రియా చక్రవర్తికి ఊరట
- ఎల్వోసీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో రియాకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్లో ఉరేసుకుని మరణించారు. అది ఆత్మహత్య కాదని.. సుశాంత్ కుటుంబసభ్యులు రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులపై కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న ఈడీ.. మనీలాండరింగ్ జరిగినట్లు భావించి రియాను ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. సుశాంత్కు రియా మాదక ద్రవ్యాలు ఇచ్చారని మరో ఆరోపణ కూడా ఉంది. ఈ క్రమంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ జైలుకు వెళ్లారు.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
Also Read: Shikhar Dhawan: ఎవరైనా సాయం చేయండి.. శిఖర్ ధావన్ పోస్ట్ వైరల్!
కేసులో భాగంగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, తండ్రి విదేశాలకు వెళ్లకుండా సీబీఐ ఎల్వోసీ జారీ చేసింది. దీనిపై రియా బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. ఎల్వోసీని రద్దు చేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. శుక్రవారం వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు.. బాంబే హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లో తీవ్రత కనిపించడం లేదని పేర్కొంది. నిందితులు కేవలం హైప్రొఫైల్ కాబట్టే పిటిషన్ దాఖలు చేసినట్టు ఉందని వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!