Vande Bharat Train: పంజాబ్లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి.. కిటకీలు ధ్వంసం
- పంజాబ్లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి
- అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు
- ఘటనలో రైలు రెండు కిటికీలు ధ్వంసం
- విచారణ చేపట్టిన రైల్వే అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫగ్వారాలో అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఈరోజు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి. సి-3 కోచ్ కిటికీపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో రెండు కిటికీలు దెబ్బతిన్నాయి. గురుగ్రామ్కు చెందిన ఇద్దరు ప్రయాణికులు.. రైలులోని C3 కోచ్లో ప్రయాణిస్తున్నారు. తాము ఫగ్వారా నుండి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కిన వెంటనే, తమ సీటు దగ్గర పెద్ద శబ్దం వినిపించిందని చెప్పారు. మొదట్లో ఏం జరిగిందో అర్థం కాలేదని.. ఆ తర్వాత బయటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారని చెప్పారు.
Mohan Charan Majhi: ఒడిశా సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణస్వీకారం..
Also Read
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
అయితే వందే భారత్ రైలుపై రాళ్లను విసిరింది.. కొందరు చిన్నారులని అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారులు కోచ్ వద్దకు చేరుకుని మొత్తం సమాచారాన్ని సేకరించారు. ఫగ్వారా-గురయా రైల్వే ట్రాక్పై చాలా కాలంగా ఏ రైలుపై రాళ్లు రువ్విన సంఘటనలు జరగలేదు. ఇదిలా ఉంటే.. వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. మార్చిలో నైరుతి రైల్వే (SWR) జోన్ గుండా వెళుతున్న నాలుగు వందేభారత్ రైళ్లపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రదేశాలలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
PAK vs IRE: పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్కు పొంచి ఉన్న వర్షం ముప్పు.. పాక్ పరిస్థితేంటి..?
ఎస్డబ్ల్యుఆర్లోని బెంగళూరు డివిజన్లో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులకు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కానప్పటికీ, రైళ్ల కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన ఒక్కో ఘటనపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది నవంబర్లో రూర్కెలా-పూరీ వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) తెలిపింది. దెంకనల్-అంగుల్ రైల్వే సెక్షన్లోని మెరమండలి మరియు బుధపాంక్ స్టేషన్ల మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎటువంటి గాయాలు జరగలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!