CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా మొత్తం చిట్టా విప్పుతా
- ఓరుగల్లు ప్రాంతం ఒక గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతం
- ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఇంటర్వెల్ మాత్రమే
- అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా మొత్తం చిట్టా విప్పుతా : సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రాంతం గొప్ప చైతన్యంతో కూడినదని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లావాసులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వరంగల్ అభివృద్ధికి రూ. 6,500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా వరంగల్ను హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన సీఎం, రాష్ట్రంపై భారీగా పెరిగిన అప్పులను ప్రస్తావించారు. రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలను బీజేపీ-బీఆర్ఎస్ పాలన నుంచి వారసత్వంగా అందుకున్నామని, ఈ మొత్తంలో కేవలం రూ. 1.53 లక్షల కోట్లు మాత్రమే చెల్లించారని వివరించారు. సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 1.50 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని చెప్పారు. రైతులకు రుణమాఫీ కింద రూ. 20,610 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
నిరుద్యోగులకు 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను అందించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, స్టేషన్ ఘనపూర్ అభివృద్ధే ఆయన లక్ష్యమని అన్నారు. గత పాలకులు చేసిన అవినీతి, దుర్వినియోగాలపై అసెంబ్లీలో స్పష్టమైన వివరాలు వెల్లడించామని, ఇంకా నిజాలన్నీ బయటపెట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. “ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఇంటర్వెల్ మాత్రమే… అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా మొత్తం చిట్టా విప్పుతా” అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
MLC Ramagopal Reddy: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..